విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత మహారాష్ట్ర నూతన సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో శివసేన స్థాపకుడు బాల్ థాకరే విధానాలను ఉద్ధవ్ ఠాక్రే అస్సలు అవలంభించలేదని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తుపెట్టుకోవడమే దారుణమని దీంతో శివసైనికులు హిందుత్వ కోసం గొంతెత్తలేకపోయారని… సావర్కర్ పేరును సైతం తలుచుకోలేకపోయారనీ అన్నారు.
తాను సహా శివసేన పరివారం దారుణమైన పరిస్థితులు చూశామన్నారు. రెండున్నరేళ్లు కాంగ్రెస్ తరచూ సావర్కర్ ను అవమానించిందని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ ను ఒక్క మాటా అనడానికి లేకపోయిందని…ఇన్నిరోజులు తాము మానసికంగా చాలా కుంగిపోయామని అసెంబ్లీలో అన్నారు సీఎం షిండే. దావూద్ వంటి వారితో ప్రభుత్వంలో ఉన్నవారు సంబంధాలు కొనసాగించారని..ఇక భరించకూడదనే తిరుగుబాటు చేసినట్టు వివరించారు.
CM @mieknathshinde told the Assembly that during MaVa govt whenever Congress used to insult Veer Savarkar, Sena members were asked not to raise issue in the Assembly
Shame on @officeofut pic.twitter.com/oboMtlBuiE
— iMac_too (@iMac_too) July 4, 2022
తిరుగుబాటుదారులమంటున్నారని..కానీ మేమంతా బాలాసాహెబ్, ఆనంద్ డిఘే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవాళ్లమని…వాళ్లెప్పుడూ అధికారం కోసం కాక ప్రజల గురించే ఆలోచించారనీ అన్నారు. శివసేన, బీజేపీ కలిసే ఉండాలని వాళ్లలా తాను కోరుకున్నానన్నారు. 2019లో బీజేపీ శివసేనకు ఉపముఖ్యమంత్రి ఇస్తానంటే శివసేన సీఎం కుర్చీడిమాండ్ చేసిందనీ అన్నారు. మహా వికాస్ అగాఢీ కూటమి ఏర్పడిన తరువాత పార్టీ తన పేరునే సీఎంగా ప్రతిపాదించినా… మాజీ డీసీఎం అజిత్ వవార్ అందుకు ఒప్పుకోలేదని..ఉద్ధవ్ ఠాక్రేను సీఎం చేయాలని పట్టుబట్టారనీ అన్నారు. బాలాసాహెబ్ మీద అభిమానంతో ఏమీ అనలేకపోయానని..తరువాత కూడా ఉద్ధవ్ ను బీజేపీకి చేరువచేసేందుకు తాను ప్రయత్నాలు చేశాననీ చెప్పుకొచ్చారు. అన్ని ప్రయత్నాలు విఫలం అవడం కూటమి శివసైనికులను అవమానిస్తుండడం తట్టుకోలేకనే తిరుగుబాటు చేసినట్టు షిండే తెలిపారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనపై ఆయన విమర్శలు గుప్పించారు . శరద్ పవార్ ఎన్సీపీతో శివసేన ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే అన్ని విషయాన్ని షిండే గుర్తు చేశారు. అలాంటిది శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపిందనీ అన్నారు.
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీ మార్కును దాటి… అసెంబ్లీలో విశ్వాస తీర్మానంలో నెక్కింది.
288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్త BJP-శివసేన కూటమి 164 ఓట్లను సాధించింది.ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని MVA కేవలం 99 ఓట్ల బలం మాత్రమే ఉంది.