ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం భారత్ లో నిర్మితమవుతోందని మీకు తెలుసా. పశ్చిమబెంగాల్లోని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం పేరుతో బృహదాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్ నెస్…ఇస్కాన్ దీన్ని నిర్మిస్తోంది. దాని ప్రధాన కార్యాలయం ఉన్న నడియా జిల్లా మాయాపూర్లో తుదిమెరుగులు దిద్దుకుంటోంది. టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం పూర్తైతే అతిపెద్ద ఆలయం మాత్రమే కాక ప్రపంచంలో అతి ఎత్తైన గోపురం కూడా ఇదే అవుతుంది.
అత్యాధునిక వసతులతో రాజభవనాన్ని తలపించేలా నిర్మించారు. ఆలయ పూజారి వసతి గృహమే రెండున్నర ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పైన వేలాడే భారీ షాండిలియర్స్ మరో ప్రత్యేకత. ప్రతీ అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం సాగుతోంది. అద్భుతమైన కట్టడం ఇది. ప్రతిఒక్కరూ దర్శించదగినది. దేశంలోని పాలరాయితో పాటు వియత్నాం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాతిని ఈ నిర్మాణంలో వాడారు.
2010లో ఆలయ నిర్మాణం మొదలైంది. ఈ ఏడాదిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ అంచనా వ్యయం 100 మిలియన్ డాలర్లు. ఆలయంలోని ప్రతీ అంతస్తులో 10 మంది భక్తులు కూర్చుని కృష్ణుడి భజన, ప్రార్థనలు, నృత్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒకేసారి 20వేలమందికి ఇక్కడ వసతి ఏర్పాటు చేసే వీలుంది.
దేవాలయ నిర్మాణం తూర్పు పడమరల మిశ్రమంగా ఉంటుంది. 2.5 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పూజారికి వ విస్తరించిన అంతస్తులో పూజారి ఉంటాడు. రాజభవనాన్ని తలపించే ఆలయంలో అత్యాధునిక వసతులన్నీ అందుబాటులో ఉంటాయి. 60 మీటర్ల వ్యాసంలో… 20 మీటర్ల పొడవు గల వేదిక్ షాన్డిలియర్లు ఏర్పాటు చేశారు. ఆలయ వైశాల్యం 70వేల చదరపు అడుగులు కాగా..ఎత్తు 380 అడుగులు.
ఇందుకు వాడిన బ్లూ బొలీవియన్ మార్బుల్ వియత్నాం నుంచి తెప్పించారు. భారత దేశం నుంచి సేకరించిన ప్రత్యేక మార్బుల్ ను పశ్చిమభాగంవైపు వాడారు. ఇప్పటివరకు 2 కోట్ల కిలోల సిమెంట్ ను ఈ టెంపుల్ నిర్మాణంలో వినియోగించారు.
ఇంతటి బృహత్ ఆలయ నిర్మాణం వెనక ఇస్కాన్ ముఖ్యోద్దేశం వైదిక సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. వైష్ణవ సన్యాసి అయిన ఆచార్య ప్రభుపాద వేద జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ నిర్మాణం చేపట్టాలని తలిచారు. చైతన్య మహాప్రభు జన్మస్థలం అయిన మాయాపూర్ ను అందుకు ఎంపిక చేసి స్థలం తీసుకుని మొదలుపెట్టారు.
ఈ అద్భుతమైన వేదిక్ ప్లానిటోరియాన్ని కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ దర్శించవచ్చు. కృష్ణుడి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ ఆలయం పూర్తై అందరికీ అందుబాటులోకి వస్తే కనుక ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అంతా భావిస్తున్నారు. ఏటా కనీసం 70 లక్షలమంది పర్యాటకులు వస్తుండడంతో ఇటీవలే హెరిటేజ్ సిటీగా గుర్తించింది మమతా ప్రభుత్వం.