జోషిమఠ్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. కొన్నిరోజులుగా నేల కుంగిపోతూ…ఇళ్లకు బీటలు వారుతున్న సంగతి తెలిసిందే. జోషిమఠ్ లోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాదని నిర్ధారించింది. నేలపై పగుళ్లు విస్తరిస్తున్నాయని, మరో కిలోమీటర్కు పైగా వీటి ప్రభావం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. 4,500 ఇళ్లకు గానూ 610 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటళ్లు,గురుద్వారాలు, కళాశాలల్లో వారిని ఉంచారు. ప్రమాదకరంగా మారిన ఇళ్లకు రెడ్మార్క్ వేశారు.