ట్విట్టర్ సంస్థకు కేంద్రం హుకుం.. ఆ ఖాతాలపై వేటు వెయ్యాల్సిందే..!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంస్థకు కేంద్రం మరో హుకుం జారీ చేసింది. రైతులను రెచ్చగొడుతున్న పాక్-ఖలిస్థాన్కు చెందిన ట్విట్టర్ అకౌంట్స్ను తొలగించాలని కోరింది. పాక్-ఖలిస్థాన్కు చెందిన 1,178 అకౌంట్స్ను వెంటనే తొలగించాలంటూ జాబితా కూడా అందజేసింది. రైతులు చేస్తున్న ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. అలజడి సృష్టించేందకు ఈ అకౌంట్స్ ప్రేరేపిస్తున్నట్లు కేంద్రం ట్విట్టర్ సంస్థకు తెలిపింది. తప్పుడు సమాచారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తూ దేశంలోని ప్రజలకు తప్పుద్రోవ పట్టిస్తున్నాయని వెల్లడించింది. వెంటనే ఈ ఖాతాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఇప్పటి వరకు ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.
https://twitter.com/ANI/status/1358616945734545408
కాగా, ఇటీవల కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు ఢిల్లీ సరిహద్దులో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ నిరసనలు జనవరి 26వ తేదీన హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో రైతుల ముసుగులో ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పాటు.. సంఘ విద్రోహ శక్తులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం కొన్ని రైతు సంఘాలు ఈ ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.