చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం పోలవరంలో ఉద్రిక్తం నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తున్న చంద్రబాబుకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. వారి తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం, పోలీసుల తీరును చంద్రబాబు ఎండగట్టారు. పోలవరం ప్రాజెక్ట్ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే పోలవరాన్ని 75 శాతం పూర్తిచేశామని, ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా ప్రభుత్వం పూర్తిచేయట్లేదని మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్ళగా పోలీసులు అనుమతించకపోవడంతో పార్టీ శ్రేణులతో కలిసి పోలవరం ముఖద్వారం వద్దే ఆయన రోడ్డుపై బైఠాయించారు. pic.twitter.com/dXwc9mZ9EO
— Telugu Desam Party (@JaiTDP) December 1, 2022