ఆక్సిజన్ కొరత నేపథ్యంలో తూత్తుకుడిలోని వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. పెద్దఎత్తున కాలుష్యపూరితం అవుతోందన్న కారణంతో 2018లో దాన్ని మూసివేశారు. అయితే ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిన ఈ సమయంలో తిరిగి …ఆక్సిజన్ ఉత్పత్తి కోసం మాత్రం తిరిగి తెరవాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ దీని పర్యవేక్షణ బాధ్యత తీసుకోనుంది.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు… స్టెరిలైట్ ప్లాంట్ ను తెరవడంలో ఇబ్బందేంటని తమిళనాడు సర్కారును ప్రశ్నించింది. ఈ సమయంలోనైనా ప్లాంట్ లో ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చు కదా అని నిలదీసింది. అటు తమకు అనుమతిస్తే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి కోవిడ్ పేషంట్లకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తామని వేదాంత గ్రూప్ సైతం కోర్టును కోరింది. దీంతో ప్లాంట్ ను ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.