ప్రతిపక్ష అన్నాడీఎంకే నాయకుడి చేతిలో కబ్జాకు గురైన వెయ్యికోట్ల భూమిని డీఎంకే సర్కారు స్వాధీనంచేసుకుంది. సుప్రీం తీర్పుతో అది సాధ్యమైంది. జెమిని వంతెనకు సమీపంలో కెథడ్రల్ సాలై అనుకుని ప్రభుత్వానికి సొంతమైన స్థలం నిన్నటి వరకు పార్టీ అన్నాడీఎంకే ముఖ్యనేత వి.కృష్ణమూర్తి చేతిలో ఉంది. హార్టికల్చర్ సంఘం అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, తన ఆధీనంలోకి తీసుకున్నాడాయన. ఆ స్థలాన్ని తిరిగి తీసుకునేందుకు 1989లో నాటి ప్రభుత్వం… మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయితే ఆజాగాలో కొంత 20 ఏళ్ల లీజుకు తీసుకున్న స్థలం ఉంది. అందులో డ్రైవ్ ఇన్ హోటల్ ఉండేది. 20 ఎకరాల స్థలంలో ఉండగా, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెమ్మొళి పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్కుకు ఎదురుగా ఉన్న వెయ్యికోట్ల విలువైన భూమిని మాత్రం కృష్ణమూర్తి కబ్జాలో పెట్టుకున్నాడు. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశాడు. అతని పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తాజాగా తీర్పునిచ్చింది. దీంతో స్టాలిన్ సర్కార్ ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుంది