రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు.చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్రభట్ తో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. మరోసారి డీల్ కు సంబంధించిన ఆధారాలు సేకరించాలని పిటిషన్లో కోరారు. డీల్ లో భాగంగా మధ్యవర్తులకు దాసో సంస్థ బిలియన్ డాలర్లు ఇచ్చినట్టు వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. అయితే సుప్రీం పిల్ ను తిరస్కరించడంతో పిటిషనర్ తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించి దాఖలైన కొన్ని పిల్ లను 2018లో కూడా సుప్రీం తిరస్కరించింది. రఫెల్ యుద్ధవిమానాల డీల్ పై ముందునుంచీ వివాదం నడుస్తోంది. విమానాల తయారీదారు దాసో ఏవియేషన్ భారత్ కు చెందిన ఓ మధ్యవర్తికి 8.8 కోట్ల రూపాయలు చెల్లించినట్టు ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ ఓ కథనం ప్రచురించింది. ఆడిట్ సందర్భంగా ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. అయితే దాసో కంపెనీ ఈ ఆరోపణల్ని ఖండించింది. వివాదాలకు కారణమైన రఫెల్ యుద్ధవిమానాలు ప్రస్తుతం భారత వాయుసేన అమ్ముల పొదిలో ఉన్నాయి.
Supreme Court refuses to entertain PIL seeking fresh probe into Rafale deal
Read @ANI Story | https://t.co/cUp3bbASlu#SupremeCourt #Rafaledeal pic.twitter.com/a7I3xdfz30
— ANI Digital (@ani_digital) August 29, 2022