పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దాఖలైన పిల్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభమయ్యేలా చూడాలంటూ పిటిషనర్ ,న్యాయవాది జయా సుఖిన్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న వేళ దాని చుట్టూ వివాదం నెలకొంది. అసలది ప్రజాస్వామ్య ప్రగతికి చిహ్నం కాదని…మోదీ వానిటీ ప్రాజెక్ట్ అని.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు మొదలుపెట్టింది. ఇక సావర్కర్ జయంతి నాడు ప్రారంభించడంపై విమర్శలు ఎక్కుపెట్టింది. తాజాగా దానిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీం దాన్ని కొట్టివేసింది.
మే 28న జరిగే పార్లమెంట్ ప్రారంభ వేడుకకు రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్ సభ సెక్రెటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ అందులో పిటిషనర్ పేర్కొన్నారు. ప్రధాని నియామకం సహా..గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాగ్ , యూపీఎస్సీ చైర్మన్ వంటి అత్యున్నత కీలక పదవుల నియామకాలకే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని…అలాంటి సుప్రీం అయిన రాష్ట్రపతి చేతులమీదుగా పార్లమెంట్ భవన ప్రారంభం జరగాలని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం నిర్ణయం ఏకపక్షంగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించింది. లోక్ సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖలను పిటిషనర్ పార్టీలుగా చేర్చారు.
Supreme Court declines the PIL seeking a direction that the new Parliament building should be inaugurated by President Droupadi Murmu on 28th May. https://t.co/Cu8Z35TRza
— ANI (@ANI) May 26, 2023