క్రైస్తవ మాఫియా వేధింపులకు బలైన తమిళనాడు తంజావూరు విద్యార్థి లావణ్య ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా పరిగణించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం. దీనిపై రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
సెయింట్ మైకేల్స్ గర్ల్స్ హోంలో ఉంటూ ప్లస్ టూ చదువుతున్న బాలికను క్రైస్తవ మతంలోకి మారాలని హాస్టల్ నిర్వాహకులు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో బాత్రూములు కడిగించడం, గదులు తుడిపించడం వంటి పనులు చేయిస్తూ వచ్చారు. ఆమె పొంగల్ సెలవుల్నీ రద్దు చేయడంతో వేధింపులు తాళలేని బాలిక పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హాస్టల్ వార్డెన్ వేధింపుల గురించి..అందుకు కారణాల గురించి చెప్పింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కేసు నమోదు చేసి హాస్టల్ వార్డెన్ నూ అరెస్ట్ చేశారు. కొన్నిరోజులకు ఆస్పత్రిలోనే లావణ్య చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. తాజాగా సుప్రీం కోర్టు ఆ కేసును సీబీఐ దర్యాప్తుకు అనుమతిచ్చింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)