సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో మూడు భారీ శోభాయాత్రలు ఒకదాని ఒకటి వెనుకా వరుసలో ప్రారంభమయ్యాయి. ఈ శోభయాత్రకు నగరం నలుములలనుంచి వేలాది మంది భక్తులు,యువకులు కషాయజెండాలు చేతబూని, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలు,డీజె పాటలతో,నృత్యాలతో శోభయాత్రలు కనుల పండుగగా సాగాయి. అయ్యాయి. ధూల్ పేట్,మంగళహాట్, గోశామహల్,పురణఫూల్,గౌలిగూడా,అఫ్జల్ గంజ్, కోఠి ఆంధ్రాబ్యాంక్, హనుమాన్ వ్యాయామశాల…ఇలా ఎటు చూసినా కాషాయజెండాలే.. శ్రీరామ నినాదాలే. ఇంకా నగరంలో అంతటాసాగిన శోభయాత్రకు అడుగడుగునా స్వాగత వేదికలు ఏర్పాటు చేసి పూల వర్షం కురిపించారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలతో శోభాయాత్ర కదలికలను పరిశీలించారు..
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)