62 ఏళ్ల క్రితం తమిళనాడు తంజావూరులోని వేదపురీశ్వర ఆలయంలో చోరీకి గురైన నటరాజస్వామి విగ్రహం దొరికింది. అమెరికాలోని మ్యూజియంలో పోలీసులు గుర్తించారు. తంజావూర్ కందియూర్ కు చెందిన ఎస్ వెంకటాచలం ఫిర్యాదు చేశారు. ఆ ఆలయం కూడా 2 వేల ఏళ్లనాటిదని చరిత్ర చెబుతోంది.అందులోని నటరాజస్వామి విగ్రహాన్ని దొంగలించి నకిలీ విగ్రహాన్ని అక్కడ పెట్టారు.
అసలైతే 35 ఏళ్లక్రితం వెంకటాచలం తండ్రి కావేరీ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి..విగ్రహాన్ని కనుగోవడంతో సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు. వెంకటాచలం ఫిర్యాదు వాస్తవమేనని నిర్థారించుకున్న తరువాత విగ్రహ విభాగం-సీఐడీ విచారణ చేపట్టింది.ఆలయంలో భక్తులు పూజిస్తున్న నటరాజ విగ్రహం నకిలీది. దర్యాప్తు బృందం పుదుచ్చేరిలోని ఇండో-ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒరిజినల్ ఫొటోలు తీసుకున్నారు. అసలు విగ్రహం చిత్రాలు తీసుకున్న తరువాత బృందం, పలు మ్యూజియాల వెబ్ సైట్లు, కళాఖండాల సేకరణదారుల బ్రోచర్లు పరిశీలించారు. ఆ పరిశోధనలోనే న్యూయార్క్ లోని ఆసియా సొసైటీ మ్యూజియంలో అది ఉందని తేల్చారు. అందుకు నిపుణుల సహాయం తీసుకున్నారు. విగ్రహం ఆచూకీ దొరకడంతో అక్కడినుంచి నటరాజ విగ్రహాన్ని తిరిగి పొందేందుకు చర్యలు వేగవంతం చేయనున్నారు.