కర్ణాటక, మంగుళూరు శివార్లలో జమాలిలో ఉన్న ఒక పాత జమా మసీదుని పునరుద్ధరించడానికి అంటే పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలలో వుండే వాస్తు శిల్పాలు, చెక్కడాలు గల స్తంభాలు గల కట్టడం బయట పడింది.
ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడకు హిందూ సంస్థలు వచ్చి గతంలో ఇక్కడ ఉన్న హిందూ దేవాలయం కూల్చి మసీదును కట్టి ఉండ వచ్చు అనే అనుమానాలు వ్యక్త పరుస్తూ తనిఖీ అయి పత్రాలు ధ్రువీకరణ పూర్తి అయ్యేవరకు పునరుద్ధరణ పనులు నిలిపివేయాలి అని అధికారులను కోరారు.
ఈ సమస్య గురించి ఫీల్డ్ లెవెల్ అధికారులు, పోలీసు అధికారులు నుండి నాకు సమాచారం అందింది. ఇండోమెంట్స్, వక్ఫ్ రికార్డులను కోరాము. భూ రికార్డులను పరిశీలిస్తున్నామని తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యధాస్థితిని కొనసాగించాలి అని దక్షిణ కన్నడ కమిషనరేట్ ఆదేశించింది.
ఈ మసీదులో దేవాలయంలో ముఖ్య ప్రదేశంలో మధ్యలో గర్భగుడి అటువైపు ఇటువైపు చిన్న గర్భ గుడులు ఉన్నట్లు వాటిని మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
గత సం. ఇలాగే కర్ణాటకలో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో మసీదును కూలదోస్తే ఒక ప్రాచీన హిందూ దేవాలయం బయట పడ్డది.
ఒక లెక్క ప్రకారం దేశంలో సుమారు 40 వేల దేవాలయాలు కూలగొట్టి మసీదులు నిర్మించారు అని సీతారాం గోయల్ వంటి వారు చారిత్రక ఆధారాలతో చెప్పారు. చాలా వాటిని లిస్ట్ ఔట్ కూడా చేశారు. ఇది మత విషయాలతో కూడిన సున్నితమైన అంశం భవిష్యతులో ఎప్పుడు అయినా మైన్స్ లాగా పేలే అవకాశం ఉంటుంది అని భవిష్యత్తు లో రాబోయే ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత, మత ప్రాదిపదికన దేశం విడిపోయిన తరువాత ఈ భయంకరమైన సమస్యకు ఒక పరిష్కారం దిశగా ఆలోచించవలసింది.
కానీ ఆ పని చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్ష చరిత్రకారులతో కలిసి ఈ విధ్వంసకర చరిత్రకు మసి బూసి మారేడు కాయ చేసి హిందువుల భావాలను బలవంతంగా అణగదొక్కింది. అప్పుడు ప్రభుత్వానికి నిజంగా సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి అనే చిత్తశుద్దే ఉండి ఉంటే చేయవలసిన పని ఏమిటీ? ఇక్కడ హిందువులతో కలసి జీవించలేం మాకు వేరే దేశం కావాలి అని కోరి ప్రత్యేక దేశం మత ఆధారంగా తీసుకున్న తరువాత ఇక్కడ ఉండాలి అని ఉండిపోయిన ముస్లిమ్స్ కి నచ్చచెప్పి ఇన్ని వివాస్పద దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అన్నిటిని హిందువులకు వెంటనే అప్పచెప్పలేరు. అందువల్ల వారు కోరుతున్న కొన్ని ముఖ్యమైన దేవాలయాలు వారికి అప్పచెప్పి వారితో ఒక ఒప్పందం చేసుకుని సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనవలసింది. అదీ కుదరక పోతే ప్రస్తుతానికి వివాస్పద కట్టడాలు అన్ని ప్రభుత్వానికి చెందుతాయి. భవిష్యత్తు లో దొరికే ఆధారాలు, కోర్టుల నిర్ణయాల బట్టి హిందువులకు కానీ ముస్లిమ్స్ కి కానీ బదలాయిస్తాం అని చెప్పవలసింది.
కానీ అది చెయ్యకుండా వామపక్ష చరిత్రకారులతో కుమ్మక్కు అయ్యి ఈ విధ్వంసకర చరిత్రను మార్చి కప్పెట్టే ప్రయత్నం చేశారు. 1976 ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో పిల్లల పాఠ్య పుస్తకాలలో నిజమైన చరిత్ర బదులు వక్రీకరించిన చరిత్ర పెట్టాలి అని నిర్ణయించిన కమిటీ సభ్యులతో విభేదించి బయటకు వచ్చిన ఆ కమిటీ మెంబర్ SL భైరప్ప గారు అప్పుడే కమిటీని హెచ్చరించారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు విధ్వంసకర చరిత్ర పిల్లల పాఠ్య పుస్తకాలలో కప్పెట్టెస్తారు కానీ భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగై ఈ పిల్లలు తల్లి తండ్రులతో కానీ తాము పెద్ద అయ్యాక గాని యాత్రల సమయంలో విధ్వంసానికి గురి అయిన ఆ దేవాలయాలను చూసినపుడు వారికి మీరు కప్పేట్టేస్తున్న చరిత్ర తెలియదా? అప్పుడు గాయపడే ఆ మనసులను మీరు ఎలా చల్లబరుస్తారు అని సూటిగా కమిటీ సభ్యులను భైరప్ప ప్రశ్నించారు.
సరిగ్గా భైరప్ప గారు భవిష్యత్తు చూసి చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. అందుకే అటువంటి వారిని ద్రష్టలు అంటారు. అలాగే అంబేద్కర్ గారు దేశ విభజన మత ప్రాతిపదికన జరిగితే పూర్తి జనాభా మార్పిడి మత ఆధారంగా జరగాలి అని సూచించారు. అప్పటి పెద్దలు ఆయన మాటా పట్టించుకోలేదు.
ఈ దేవాలయాల సమస్య కావచ్చు, కాశ్మీర్ సమస్య కావచ్చు ఇలా సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యల తీసుకోకుండా సమస్యలను వాయిదా వేసి కాంగ్రెస్ పెద్దలు మురగబెట్టడం వల్ల జరిగే దుష్ఫలితాలను ఇప్పుడు దేశం అనుభవిస్తోంది. ఒక వైపు వారణాసి ఒక వైపు కృష్ణ జన్మ స్థానం దేవాలయాల యజమాన హక్కుల మీద కోర్టుల్లో వాదనలు జరుగుతూ ఉంటే మరోవైపు మంగుళూరు దగ్గర దేవాలయం బయటపడ్డ సంఘటనలు వంటివి జరుగుతున్నాయి.
~ చాడా శాస్త్రి
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)