
ఈ రోజు వెలువడిన కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నా, దేశమంతా ఒకే తీరుగలేదు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ , దిల్లీ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది . 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, బంగాల్, పంజాబ్ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలుస్తున్నది . 13 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయనితెలుస్తున్నది . మొత్తం మీద . 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉన్నది.
గడచినా కొన్ని వారాలుగా పెరుగుతున్న కరోనా మహమ్మారి ప్రమాదం చేజారే ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నవేళ రాష్ట్రాలు అప్రమత్తం కావటం ప్రారంభమైనది చిన్నగా ఆంక్షలతో ప్రారంభమై పరిమిత ఆంక్షలతో లక్డౌన్ దిశగా షుమారు అన్ని రాష్ట్రాలు కదిలాయి. పరిస్థితులను చక్కదిద్దుకొనేందుకు ఇంకా ముందే తగుజాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంతదారుణ పరిస్థితులు వచ్చేవికావు కేంద్రం ఎప్పటికప్పుడుతగు సూచనలు చేస్తున్నప్పటికీ ఈ పరిస్థితికి కారణం కేంద్రమే అనే అభిప్రాయం దేశంలో ప్రపంచంలో కలిగించే ప్రయయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి దానికి తోడు మీడియా ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసి ఎట్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచే స్తున్నదో మనం చూస్తూనేఉన్నాం, ఎట్టకేలకు పాలకులలో కదలికలు ప్రారంభమైనాయి ఎక్కడెక్కడ ఏమి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు చూద్దాం
సంపూర్ణ లాక్డౌన్ విధించనప్పటికీ.. దాదాపు దేశమంతా ఆంక్షల బాటలోనే కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్డౌన్లు విధిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.
లాక్డౌన్లు ఎక్కడెక్కడ?
o తెలంగాణలో బుధవారం నుంచి లాక్డౌన్ అమలు కానుంది. 10 రోజుల పాటు ఆంక్షలు ఉండనున్నాయి. లాక్డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
o దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను రద్దు చేశారు.
o తమిళనాడు, రాజస్థాన్, పుదుచ్చేరిలో సోమవారం నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి.
o హరియాణాలో ఈనెల 17 వరకు లాక్డౌన్ పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ అమలు చేశారు.
o కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరంలో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్డౌన్ కొనసాగుతోంది.
o బిహార్లో ఈ నెల 15 వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
o ఒడిశాలో 14 రోజుల లాక్డౌన్ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది.
o నాగాలాండ్లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లోకి రానుంది. వారం పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది.
వారాంతాల్లో..
o చండీగఢ్లో వారాంతపు లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. మే 11నుంచి మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ను కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
o ఛత్తీస్గఢ్లోనూ వారాంతపు లాక్డౌన్ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్డౌన్లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
o పంజాబ్లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.
లాక్డౌన్ తరహా..
o ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ తరహా కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చింది. మే 5న ప్రారంభమైన ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి.
o మహారాష్ట్రలో ఏప్రిల్ 5న ప్రారంభించిన నిబంధనలను ఈనెల 15 వరకు పొడిగించారు. నాశిక్లో మే 12 నుంచి 23 వరకు ఈ నిబంధనలు అమలు కానున్నాయి.
o ఉత్తర్ప్రదేశ్లో లాక్డౌన్ తరహా కఠిన నిబంధనలతో కూడిన కరోనా కర్ఫ్యూను ఈనెల 17 వరకు పొడిగించారు.
o ఝార్ఖండ్లో ఈనెల 13 వరకు పొడిగించారు.
o కర్ణాటకలో ఈనెల 24 వరకు అమలు చేస్తున్నారు.
o సిక్కింలో ఈనెల 16 వరకు ఆంక్షలు విధించారు.
o జమ్మూ-కశ్మీర్ అధికార యంత్రాంగం ఈనెల 10 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.
o లద్దాఖ్లోని లేహ్లో కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించారు.
కర్ఫ్యూలు..
o గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది.
o మధ్యప్రదేశ్లో ఈనెల 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
o గుజరాత్లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 12 వరకు అమలు చేస్తున్నారు.
o అసోంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు.
o అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
o మణిపుర్లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
o ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను తిరిగి విధించింది.
o హిమాచల్ప్రదేశ్ ఈనెల 7 నుంచి 16 వరకు లాక్డౌన్ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట నిబంధనలు విధించింది.
o బంగాల్లో గత వారం నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.