జమ్ముకశ్మీర్లో లష్కరేతోయిబా డమ్మీగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రసంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ యూఏపీఏ చట్టం కిద చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. “లష్కరే అనుబంధ సంస్థగా 2019 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువతను రిక్రూట్ చేసుకుంటోంది. పాక్ నుంచి చొరబాట్లు, ఆయుధ,మాదకద్రవ్యాల అక్రమరవాణావంటి వాటికి పాల్పడుతోంది. భారత్కు వ్యతిరేకంగా గళమెత్తేలా జమ్ముకశ్మీర్ ప్రజల్ని రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి”అని గెజిట్లో పేర్కొంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేత తరువాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు తెరపైకి వచ్చింది. గతేడాదిలో సంస్థ నాయకుడు అబ్బాస్ షేక్ ను భారత దళాలు మట్టుపెట్టాయి.