ఆ ఎంపీ చావుకు కారణం అధికారుల వేధింపులే.. శివసేన ఎంపీ.
దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సూసైడ్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబైలోని ఓ హోటల్ రూంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన సూసైడ్ విషయాన్ని శివసేనా పార్టీకి చెందిన ఎంపీ లోక్సభలో లేవనెత్తారు. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ మోహన్ దేల్కర్ మృతి గురించి మాట్లాడుతూ.. ఆయన 35 ఏళ్ల పాటు పార్లమెంట్కు హాజరయ్యారన్నారు. ఆయన మృతికి అధికారుల వేధింపులే కారణమని ఆరోపించారు.
ఎంపీ మోహన్ దేల్కర్ స్వతహాగా రాసిన సూసైడ్ నోట్ను పరిశీలిస్తే.. ఆయన ఎంత తీవ్రంగా బాధపడ్డారో అర్ధమవుతుందని శివసేన ఎంపీ అన్నారు. మోహన్ దేల్కర్ ఏడు సార్లు ఎంపీగా పనిచేశారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపీ మృతిచెందిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. స్థానిక అడ్మినిస్ట్రేటివ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేనా ఎంపీ డిమాండ్ చేశారు. ఆయన రాసిన సూసైడ్ నోట్లో అనేక మంది అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోందని.. లేఖను పరిశీలించి సదరు అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
https://twitter.com/ANI/status/1369548595242835971