అడవుల్లో ఆయుధాలు పట్టి తిరుగుతున్న నక్సలైట్లను ఎరువేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆపరేషన్ కగార్ చేపట్టింది. అడవుల్లో మారుమూల దక్కిన నక్సలైట్లను కూడా చాకచక్యంగా పట్టుకోగలుగుతున్నారు. కానీ అడవుల్లో నక్సలైట్లు కంటే పట్టణాల్లో దాగి ఉన్న అర్బన్ నక్సలైట్ల తోటే పెద్ద సమస్య కనిపిస్తోంది.
దేహాన్ని మన దేశంగా పోల్చుకుంటే మన దేశంలో వైరస్ లాంటి కొన్ని కొని చెడు వ్యవస్థలు బలంగా పెనవేసుకుపోయాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటిపై నిర్లక్ష్యం చూపించాయి. రాజకీయ ప్రయోజనాలు, ఇతర కుట్రల కారణం అలాంటి వైరస్లను కాపాడుతూ వచ్చారు.
ఫలితంగా దేశం ఎంతో అస్థిరతకు గురైంది. అలాంటి వైరస్లలో ప్రధానమైనది మావోయిజంగా మారిన నక్సలిజం.
దీని విషస్వరూపం అంతా ఇంతా కాదు. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తామన్న పిచ్చి ఆలోచనలతో నక్సలైట్లు అడవుల బాట పట్టారు. మావోయిస్టులుగా పేరు మార్చుకుని నరమేథం చేస్తున్నారు. అసలు ఎందుకు చంపుతున్నారో వారికీ తెలియదు.
వేల మంది అమాయక పోలీసుల్ని, పౌరుల్ని హతమార్చారు. ఎంతో మందిని చంపడానికి కుట్ర పన్నారు. వీరికి మద్దతుగా అర్బన్ నక్సల్స్ ఉన్నారు. ఈ అర్బన్ నక్సల్స్ కాలేజీల్లో, యూనివర్శిటీల్లో, ఇతర చోట్ల నక్సల్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వారికి కావాల్సిన సమాచారాన్ని చేరవేస్తూ దేశంపై అంతర్గతంగా ఉంటూ కుట్రలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని అర్బన్ నక్సల్స్ అంటే చాలా మందికి కోపాలు వస్తాయి.
నిజం చెప్పాలంటే,,, కాలేజీల్లో , విశ్వ విద్యాలయాల్లో కొందరు ప్రొఫెసర్ల ముసుగులో భావజాలం వ్యాప్తి చేసి నక్సల్స్ రిక్రూట్స్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారు, ఉద్యోగాలు చేయిస్తున్నారు. పేద పిల్లలకు మాత్రమే ఇక్కడ వారి బ్రెయిన్లను వాష్ చేసి మావోయిస్టులు ఆలోచనలతో ఆయుధాలు పట్టుకొని వెళ్త మంటున్నారు. ఈ మేధావులు పట్టణాల్లో ఉపన్యాసాలు చెప్పే వీరు వీరి పిల్లలకు ఎందుకు విప్లవ పాఠాలు వారి ఇంట్లో చెప్పడం లేదు? తమ ఇంట్లో సిద్ధాంతం చెప్పలేని వారు ఇతర పిల్లలకు చెప్పడానికి అర్హత ఉందా అని అడిగితే సమాధానం లేదు.
మరో వైపు, నక్సలైట్లు అమాయకులని చంపితే ఒక్కరూ నోరు మెదపరు. అడవుల్లో తిష్ట వేసి అక్కడి గిరిజనుల్ని అడ్డం పెట్టుకుని వారి సాయంతో బతుకుతూ ఇన్ఫార్మర్ల సాయంతో వారినే చంపుతూంటారు నక్సలైట్లు. ఎందుకంటే వారిలో భయం పుట్టించడానికి.!
నక్సలైట్లకు ఆయుధాలు ఖచ్చితంగా విదేశాల నుంచి వస్తున్నాయి. ఒకప్పుడు వీరు చైనా తో పాటు శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈతోనూ అనుబంధంగా ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. విదేశీ శక్తులతో జత కూడి వారి వద్ద ఆయుధాలు తీసుకుని దేశంపై దండెత్తేవారిని ఏమనాలి? వారిని ఉపేక్షిస్తే జరిగే పరిణామాలకు బాధ్యలు ఎవరు ?. నక్సలైట్ల హింసాకాండకు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది బలయ్యారు.
దుద్దిళ్ల శ్రీపాదరావు, మాధవరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి వారిని హతమార్చారు. మొన్నటికి మొన్న గిరిజన ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేశ్వరరావును అంతం చేశారు. అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు వ్యాస్, ఉమేష్ చంద్రతో పాటు మరికొంత మందిని చంపేశారు.
అటువంటి నక్సలైట్లకు మద్దతుగా ఈ అర్బన్ నక్సలైట్లు విష ప్రచారం చేస్తున్నారు. అటువంటప్పుడు ఈ అర్బన్ నక్సలైట్ల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. లేని పక్షంలో అడవుల్లోని నక్సలైట్లను నిర్మూలించినా,,, ఇక్కడి అర్బన్ నక్సలైట్లు మరి కొంత మందిని తయారు చేసి పంపించరు అన్న గ్యారెంటీ లేదు.