రాష్ట్రంలోని 424 మందికి అందించిన భద్రతను ఉపసంహరించుకుంది పంజాబ్ ప్రభుత్వం. భద్రతను ఉపసంహరించుకున్న వారిలో పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు సహా రాజకీయ ప్రముఖులు ఉన్నారు.
ఏప్రిల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో సహా 184 మందికి భద్రతను ఉపసంహరించుకోవాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది.
దాంతో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్తాప్ సింగ్ భార్య భద్రతను గత నెలలో ఉపసంహరించుకున్నారు.