ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రికలైన న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, లే మోండే, మరియు స్ట్రెయిట్స్ టైమ్స్, మరియు టివి ఛానెళ్లలోభారతదేశంలో జరిగిన హరిద్వార్ కుంభమేళా , 5రాష్ట్రాల ఎన్నికలు , కోవిడ్ -19 రెండవ వేవ్ లో కరోనా వ్యాప్తికి కారణమని అంతర్జాతీయ మీడియాలో “ఏకపక్ష” కథనాలు సంపాదకీయాలు కేంద్ర ప్రభుత్వాన్ని అందులోమోడీ ని విమర్శిస్తూ,వెల్లువెత్తాయి. . సోషల్ మీడియా లోనైతే ఫేక్ వార్తలు వైరల్ అయినాయి. కరోనా రెండవ వేవ్ కట్టడి చేసే సంసిద్ధత సామర్థ్యం భారత్ కు లేదు అని అర్ధం చేయించటానికి ఆసుపత్రుల వెలుపల అంబులెన్స్లు , రోగుల దృశ్యాలు,ఢిల్లీ మరియు ఇతర ప్రాంతాలలో శవాల దహన సంస్కారాలు పదే పదే చూపిస్తున్నారు.ప్రతి అంతర్జాతీయ నివేదికలో దీనిని “సూపర్ స్ప్రెడర్” సంఘటనగా అభివర్ణించారు. దీనికి కారణం మోడీ అనే అభిప్రాయం నిర్మాణంచేయటం వాళ్ళ లక్ష్యం గా కనబడుతున్నది దానికి సంబంధించిన కొన్నివివరాలు గమనిద్దాము.
1] గడిచిన కొన్ని రోజులుగా భారతదేశంలో COVID-19 రెండవవేవ్ వేగంగా వ్యాప్తి చెందుతూ సరాసరి రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదుఅవుతున్నాయి ముందుగా హెచ్చరించినప్పటికీ నరేంద్రమోడీ జాగ్రత్తలు తీసుకోలేదు అందుకే నేరేంద్రమోడీ ని”సూపర్ స్ప్రెడర్” అనిభారతీయ వైద్య సంఘం (IMA) జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజోత్ దహియా విమర్శించారు. ప్రభుత్వం ఏమి చేస్తుందోవారికి తెలియదా, తెలుసు అయినా మాట్లాడారు. దానివెనుక ఎదో ప్రత్యక లక్ష్యం ఉంది ఉంటుంది
పి. కె. బాలచంద్రన్ శ్రీలంకలో ఉంటూ అంతర్జాతీయ మీడియా కోసం పనిచేస్తున్న సీనియర్ ఇండియన్ జర్నలిస్ట్ ఈ మధ్య ఒక అంతర్జాతీయ మీడియా లో బెంగాల్ ఎన్నికలపై ఏమి వ్రాసారో చూద్దాము
2] పశ్చిమ బెంగాల్లోఫలితాలు ఎట్లావచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో హిందుత్వ రాజకీయాలు బలంగా వేళ్ళూనుకొన్నాయి. బెంగాల్ చరిత్రలో మొదటిసారిగా బిజెపికి రాష్ట్రంలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నది. దీనిని నియంత్రించకపోతే అది పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక భావాలు రేకెత్తిస్తుంది. ప్రస్తుతం భారత్ -బంగ్లాదేశ్ ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి , అవి దెబ్బ తినే అవకాశం ఉన్నది. .పశ్చిమ బెంగాల్లో మరియు తమిళనాడు ఎన్నికలలో బీజేపీ ఓటమిపాలయింది అట్లాగే కోవిద్ మహమ్మారి రెండవ వేవ్ తో పెద్ద ఎత్తున సంభవించిన మరణాలను నివారించడంలోమోడీ వైఫల్యం చెందాడు దానితో బిజెపి, మోడీ మరియు అమిత్ షా యొక్క ఇమేజ్ను దెబ్బతిన్నది . వ్యతిరేకత ఎంతఉన్నది, అది ఎట్లా పెరుగుతున్నది , దాని నివారణకు వాళ్ళుఏమి చేస్తారు అనేదానిపై 2024 లో వచ్చేఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.బంగ్లాదేశ్ విషయం ఎందుకు ప్రస్తావించారు అంటే బంగ్లా అక్రమ వలసలపై ప్రచారం లో బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఇది ముస్లింలను రెచ్చగొట్టటం అవుతుంది కాబట్టి మోడీ గెలవకూడదు ఇది ఉదారవాదమేధావుల పోకడ దేశానికీ నష్టం జరిగిన ముస్లింలను అందులో బంగ్లా ముస్లింలను ఏమి అనకూడదు. అంటేవాళ్లదృష్టిలో ఇస్లాం కంటే హిందుత్వం, మోడీ దేశానికీ ప్రమాదం.
భబాని శంకర్ నాయక్, గ్లాస్గో విశ్వవిద్యాలయం, యుకె నుండి ఒకప్రముఖ వెబ్ సైట్ లో వ్రాసిన వ్యాసంలో మోడీ ని హిందుత్వ రాజకీయాలను విమర్శించాడు ఆ వివరాలు
3]పోలియోవైరస్లను (డబ్ల్యుపివి) పూర్తిగా తొలగించడానికి పోలియో రహిత దేశంగాభారత్ కావాలని డోర్-టు-డోర్ తిరిగి పోలియో వ్యాక్సిన్ వేశారు . అదే విధంగా, కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి డోర్ తో డోర్ ఎందుకు వెయ్యటంలేదు దానికి కావలసిన వనరులు మౌలిక సదుపాయాలు ఉన్నాయి వాటిని సమీకరించుకునేందుకు మోడీ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం లేకపోవడం ఘోరమైన పరిస్థితికి దారితీసింది.మధ్యయుగల నాటి హిందుత్వభావాలకు మానవతా దృక్పథం లేకపోవటం అనేదే పెద్ద సమస్య. హిదూత్వం ఒక వైరస్ గా దేశమంతా విస్తరించి దేశంలో అనేక సంఘర్షణలకు దారితీస్తున్నది భారత మనుగడ కోసం భారతీయ సమాజం నుండి హిందుత్వ వైరస్ తొలగించాలి దానికోసం వ్యవస్థీకృత ప్రజా ఉద్యమం అవసరం భారతదేశానికిశాంతి మరియు శ్రేయస్సుకోసం హిందుత్వ రాజకీయ అంటువ్యాధిపై పోరాడటానికి భారతీయులను సిద్ధం చేయాలి. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినపౌరసత్వ హక్కులు పరస్పర విశ్వాసం ఆధారంగా రాజకీయ చైతన్యాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య టీకాలతో హిందుత్వ వైరస్ను ఓడించడానికి భారత రాజకీయల రోగనిరోధక శక్తిని పెంచడం తప్ప వేరే మార్గం లేదు. అని ఏదేదో వ్రాసుకొంటూ వచ్చాడు. మతతత్వం అంటే ఏమిటి జాతీయతత్వం అంటే ఏమిటో స్పష్టత లేని ఉదారవాద మేధావుల వడలు ఇట్లాగే ఉంటాయి అవి ఏదేశానికి ఇప్పటికే ఎంతో నష్టంచేసింది ఇంకా చేస్తుంది మనం అప్రమత్తంగా ఉండాలి.
4] ప్రపంచం లో కరోనా మొదటి వేవ్ సమయంలో అమెరికా అతలాకుతలం అయింది ఆసమయంలో 18. 3మిలియన్ల మంది అమెరికన్లు కరోనా బారినపడ్డారు.అందుకే అమెరికాను ”SUPER SPREDER ” అన్నారు. రెండవ వేవ్ లో భారత్ ఆ రికార్డు ను అధిగమించేట్లు గా ఉన్నది. దానికి కారణం హరిద్వార్ లో కుంభ మేళ , ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఆ సమయంలో బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించటం కారణమని దేశీయ విదేశీయ మీడియా విపరీత ప్రచారం చేసింది దానికి మోడీ ని తప్పు పట్టింది. ఆ సమయంలో కరోనా మహారాష్ట్ర ,ఢిల్లీ కర్ణాటక రాష్ట్రాలలో విపరీతంగా ఉన్నది. కుంభమేళాకు ఎన్నికలకు ఆ రాష్ట్రాలకు ఏమి సంభంధం లేదు, వాస్తవాలు తెలిసినప్పటికీ దీనికి కారణం మోడీ అని అదుపు లేని ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ లక్ష్యం కరోనా కట్టడి కాదు మోడీని దించాలి
5] న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ జోసెఫ్ హోప్ ” మోడీని ప్రమాదకర దేశభక్తుడని ”వ్యాఖ్యానించి నట్లు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో వైరల్ అయ్యింది వాస్తవంగా ఆ పత్రిక ఎడిటర్ మోడీ గురించి ఎటువంటి వ్యాసము వ్రాయలేదు , ఈ విషయాన్ని ఇండియా టుడే anti ఫేక్ న్యూస్ వార్ రూమ్ తన అధ్యయనంలో బయట పెట్టింది. అంటే వ్రాయనటువంటి ఈ వ్యాసాన్ని వ్రాసినట్లుగా వైరల్ ఎవరు చేశారు, ఏ కారణంతో చేశారో అర్ధమైఉంటుంది
6] టైమ్స్ నే అమెరికా పత్రిక 2006 సంవత్సరంలో జూలై 17న” super spredar ”మోడీ అని రాజకీయ కథనం వ్రాసింది దానిని మార్ఫింగ్ చేసి కరోనా super seprder మోడీ అని సోషల్ మీడియాలో ఏప్రిల్ 28వ తేదీ నాడు హల్ చల్ చేసింది. దానిపై timesmagzine వాళ్ళు కరోనా సమయంలో మోడీ మీద మేము ఎటువంటి ఆర్టికల్ వ్రాయలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.
7] ఏప్రిల్ 29 గురువారం లతీఫ్ అనే జర్నలిస్ట్ దేశంలో కరోనా రెండా వేవ్ లో మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు గుర్తించబడ్డారు ఇదంతా ఎన్నికలు కుంభమేళ తర్వాత ఇంత తీవ్రంగా వ్యాపించింది అని లవిమర్శించుకుంటూ రాసుకుంటూ పోయాడు
8] వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక” ప్రశ్నించే గొంతులనుమోడీ ప్రభుత్వం నొక్కి వేస్తోందని” వ్రాశారు. దీనికి రిజైన్ మోడీ అని మనదేశం సోషల్ మీడియాలోహల్చల్ అయింది ఇది చేసినవారికి స్వపరబేధం లేదు ,మనదేశ పరువు తీస్తున్నారు. చివరికి దీనిని సోషమీడియా లో తొలగించారు.
. కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నాయి, .ఎదుర్కొంటున్నాయి కానీ మనదేశంలోనే ఇంతవిపరీత దుష్ప్రచారం జరగటానికికారణం ఏమిటి ? వాళ్ళ దృష్టిలో మనదేశంలో హిందుత్వం, అంటే మతతత్వం ,మైనార్టీ లను అడిచివేస్తున్నది , దేశం లో అనేక ఘర్షణలకు కారణం వాళ్లే. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఇస్లాం ఒక పెద్దసమస్య, అసమస్యను భారత్ వెయ్యి సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నది దేశాన్ని ముక్కలు చేసుకొన్నది అయినా భారత్ లో మైనార్టీ లకు రక్షణ లేదు దానికి కారణం హిందూ శక్తులు అన్నది వాళ్ళ ప్రచారం కరొనకు హిదుత్వానికి ఏమి సంభంధం ,లేదు కానీ హిందుత్వాన్ని మోడీని తిట్టటం వాళ్ళ లక్ష్యం ఈ దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టటానికి దేశమంతా ఒక్కటి కావాలి.