సిమ్లాలో రోడ్షో పాల్గొంటుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన కారును ఆపి ఒక అమ్మాయి వేసిన తన తల్లి హీరాబెన్ పెయింటింగ్ను స్వీకరించారు. సిమ్లాలోని రిడ్జ్ మైదాన్కు వెళ్లే రహదారిపై మోదీని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. జనం మధ్య అను అనే అమ్మాయి ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ పెయింటింగ్ను పట్టుకుని ఉంది. పెయింటింగ్ ను గుర్తించిన ప్రధాని తన కాన్వాయ్ ను ఆపి.. కారు దిగి అమ్మాయి దగ్గరకు వచ్చారు. పెయింటింగ్ ను చూసి ఎంతో సంతోషించారు మోదీ.
“మీ పేరు ఏంటి? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఈ పెయింటింగ్ వేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? అని అమ్మాయిని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
తాను సిమ్లాకు చెందినదానినని.. ఒక్కరోజులో హీరాబెన్ పెయింటింగ్ను తయారు చేశానని అను సమాధానమిచ్చింది. తాను ప్రధాని పెయింటింగ్ను కూడా రూపొందించానని, దానిని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ద్వారా ఆయనకు పంపినట్లు ఆమె ప్రధానికి తెలియజేసింది. అనంతరం ఆ యువతి ప్రధాని మోదీ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుంది.