గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా ఓ జైన సాధ్వి రాష్ట్రపతికి రాసిన లేఖను చూస్తే అర్థం అవుతుంది. జనావాసాల మధ్య సాత్వికాహారం తీసుకునే సాధువుల్ని కావాలని రెచ్చగొడుతూ జంతువధ చేస్తుంటే వారు ఎంత నరకం అనుభవించారన్నది మనకు తెలుస్తుంది. ఆ విషయంగా తాను పడిన క్షోభను 2014లో నాటి రాష్ట్రపతికి, నాడు ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నేటి దేశప్రధాని నరేంద్రమోదీకి, ఆ రాష్ట్ర గవర్నర్ సహా ఇతర అధికారులకు రాసిన లేఖ గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
సూరత్ …వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన గుజరాత్ రాష్ట్రంలోని ఓ ముఖ్యనగరం. అక్కడి గోపీపురాలో ఒకప్పుడు జైనులు ఎక్కువగా ఉండేవారు. మాంసాహారం అసలే ముట్టని జైనుల్లోని ఓ వర్గం కనీసం భూమిలో పెరిగే కందమూలాల్ని భుజించరు. అంతటి నియమబద్దమైన సాత్వికాహారం తీసుకుంటారు. అప్పుడు ఆ ప్రాంతంలో జైనులు ఎక్కువగా ఉండేవాళ్లు, కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ముస్లిం ప్రాబల్య ప్రాంతమైంది.
అక్కడి పరిస్థితుల్ని వివరిస్తూ ఆవేదనతో ఆ జైన సాధ్వి 2014లో రాష్ట్రపతికి రాసిన లేఖలోని ముఖ్యాంశాలు…
‘ మేం నివసిస్తున్న గోపీపురా ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో 25 జైన మందిరాలుండేవి. జైన సాధ్విలు నివసించే 35 ఉపాశ్రయలుండేవి. అందులో దాదాపు 70 నుంచి 80మంది సాధ్వీలం ఉండేవాళ్లం. క్రమంగా మేముంటున్న ప్రాంతంలో ముస్లింల జనాభా, వారి పట్టు పెరగసాగాయి.
‘ముఖ్యంగా ననంద్ భోజాయ్ ఉపశ్రాయ్ తోపాటు శ్రీ సులస శ్రావికా ఆరాధనా భవన్, పరగ్ అపార్ట్ మెంట్, గణేశ్ సొసైటీ, స్పితా అపార్ట్ మెంట్ ఇలా అన్ని చోట్ల ఇప్పుడు ఎక్కడ చూసినా ముస్లింలో ఉన్నారు. నవపాద్, యశా అపార్ట్ మెంట్ ,మేఘ్ గంగా, నవకార్, ఆకాశ్ డైమండ్ ప్రాంతాల్లోనైతే మొత్తం ఇప్పుడు ముస్లింలే నిండిపోయారు. ఆ ప్రాంతం మొత్తంలో 50 శాతానికి వారి జనసంఖ్య చేరుకుంది.’
‘దేవుడు మనుషులందర్నీ సమానంగా సృష్టించాడు.. ఆయన దృష్టిలో అందరూ సమానమే కానీ ముస్లింల దూకుడు.. తమ వంటి వారికి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కొందరు ముస్లింలు నాలుగైదు పిల్లులు, మేకలను పెంచుకుంటారు. సులస శ్రావిక ఆరాధన భవన్ సమీపంలో ఓ ముస్లిం ఫ్యామిలీ ఉండేది వారింట్లో రెండు మేకలుండేవి. అర్థరాత్రి అవి చలిని తట్టుకోలేక వణుకుతూ, వర్షానికి నానుతూ ఏడుస్తుండేవి. వాటి అరుపులు, ఏడుపులు మాకెంతో బాధ కలిగించేవి. ఎందుకంటే పశుపక్ష్యాదులు మనలాంటివే.. అవీ ప్రాణులే వాటిని కష్టపెట్టొద్దు అని మేం నమ్ముతాం’.
‘ఆ ఇళ్లల్లోని పిల్లలు వీధి కుక్కలను తరుముతూ బెల్టులతో కొట్టేవారు. వాటి కాళ్లు విరగ్గొట్టేవారు. చూస్తూ బాధపడడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. కేవలం పశుపక్ష్యాదుల పట్ల మాత్రమే కాదు సాటి మనుషులమైన మా పట్లా కొందరు దుర్మార్గంగా ప్రవర్తించేవారు. మా గుమ్మం ముందు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బంగాళాదుంప తొక్కలు పడేసేవారని అందులో పేర్కొన్నారు. అందరికీ తెలుసు జైనులు భూమిలో పెరిగే దుంపలు తినరు’.
‘2013లో బక్రీద్ సందర్భంగా జరిగిన ఘటనను మరువలేను. అక్కడి ఒకరింట్లో ఇంటిముందు మేకలు కట్టారు. చిన్న దున్నపోతు కూడా ఉంది. ఈద్ కు ముందు రోజు ఆ ఇంట్లోని పిల్లలు ఆ మేకల్ని, దున్నను కావాలని మా ఉపాశ్రయ్ ముందుకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అంటే రేపు వీటిని మేం వధిస్తున్నాం…మీరేం చేయగలరు అనే ధోరణి వాళ్ల తీరులో కనిపించింది. మాకు కాస్త సమీపంలో ఉండే మహబాబు భాయ్ జైన సాధ్విలందరం సరిగ్గా భోజనానికి కూర్చునే సమయానికి ఇంటిముందు మేకను కోసేవాడు. దాని అరుపులు మాకు వినిపించేవి. తెల్లవారుజామున నాలుగు గంటలకు మరో మేక. బ్రహ్మముహూర్తమైన ఆ సమయంలో మేం నవకార్ మంత్ర జపం చేస్తుంటాం..ఆ మేకను చంపేప్పుడు దాని అరుపులు మా చెవిని తాకుతుంటే మేం భరించలేకపోయేవాళ్లం. ఆ బాధను భరించేందుకు మేం నవకార్ మంత్రాను మరింత బిగ్గరగా చదివేవాళ్లం’.
“ఓ రోజైతే రష్మి అపార్ట్ మెంట్ పక్కనుంచి ఎర్రటి నీళ్లు కాలువలా పోతోంది. అటునుంచి వెళ్తూ కుంకుమ నీళ్లేమో అనుకున్నా. కానీ అక్కడివాళ్లు చెప్పారు అది మేకలు, దున్నపోతుల రక్తం అని. వినగానే నేను కళ్లు తిరిగి పడిపోయా. అలాంటి పరిస్థితులో మేం ఇక్కడ ఎలా జీవించగలం.మా విశ్వాసాలకు తగినట్టు జీవించే హక్కు మాకు లేదా “అని ప్రశ్నిస్తూ ఆమె నాటి రాష్ట్రపతికి లేఖరాశారు.
ఆ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల రూపాయలకే ముస్లింలకు ఇళ్లు విక్రయించకుండా కఠినచట్టం తీసుకురావాలని ఆమె మోదీకి విజ్ఞప్తి చేస్తూ లేఖరాశారు. ఈ జైనసాధ్వి మాత్రమే కాదు స్థానికులు చాలామంది చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖ రాసిన సాధ్వి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ బతికారు.
అసలైతే జనావాసాల మధ్య పశువధ చట్ట ప్రకారం నిషేధం. కానీ సూరత్ లో మాత్రమే కాదు… హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో జనావాసాల మధ్యే పశువధ జరుగుతోంది. ముఖ్యంగా బక్రీద్ వంటి పండగలప్పుడైతే రోడ్ల మీదే రక్తం ఏరులై పారుతూ ఉంటుంది.
గుజరాత్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సఫర్ ఆఫ్ ఇమ్మోవెబుల్ ప్రాపర్టీ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ టెనెంట్స్ ఫ్రం ఎవిక్షన్ ఫ్రం ప్రెమిసెస్ ఇన్ డిస్టర్బ్ డ్ ఏరియాస్ ఆక్ట్ 1991, డిస్టర్బుడ్ ఏరియాస్ ఆక్ట్ ను సవరిస్తూ 2019లో గుజరాత్ సర్కారు చట్టాన్ని తీసుకువచ్చింది. 2020 అక్టోబరులో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 1986లో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మతపరమైన అల్లర్ల తరువాత ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ తరువాత నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్దఎత్తున స్థిరాస్థి విక్రయాలు జరిగాయి. కొత్త చట్టం ప్రకారం మత సామరస్యానికి విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా..ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా జిల్లా కలెక్టర్ స్పందిస్తారు…జోక్యం చేసుకుంటారు. కలెక్టర్ ఆదేశంతో పోలీస్ కమిషనర్ వివరాలు ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. అక్కడికక్కడ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతారు.
https://twitter.com/MrSinha_/status/1473270164766412801?s=20