20 ఏళ్లుగా పరారీలో ఉన్న బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడు. తివారీ కోసం పోలీసులు 20 ఏళ్లుగా గాలిస్తున్నారు.
ఆయన తలపై రూ. 25 వేల రివార్డు కూడా ఉంది.అయితే ఎట్టకేలకు ఇవాళ ఇండియా-నేపాల్ సరిహద్దులోని రక్సౌల్లో తివారీ పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసుల బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది.
1998లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో పోలీసులపై కాల్పులు జరిపారు. మరుక్షణం పరారైన అతనికోసం నాటినుంచి పోలీసులు వెదుకుతూనే ఉన్నారు. ఇవాళే ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు యూపీ పోలీసులు తెలిపారు. రంజన్ తివారీ రక్సౌల్ మీదుగా కఠ్మాండు పారిపోయేయత్నంలో దొరికిపోయినట్టు రక్సౌల్ ఎస్పీ చంద్ర ప్రకాశ్ తెలిపారు.