2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా అదిలాబాద్ లో జరిగిన ఎన్నికల సభలో సొనాల గ్రామాన్ని మండలముగా ప్రకటించిన అప్పుడు కార్యరూపం దాల్చలేదు. 2018 నుండి ప్రారంభం అయిన మండల ఆందోళన 2023 వరకు సాగింది.
సొనాల గ్రామ& చుట్టుపక్కల గ్రామ ప్రజలు మండల సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులు,ఉద్యోగులు,
వ్యాపారస్తులు,శ్రామిక రంగానికి చెందిన వ్యక్తులు,వ్యవసాయ దారులు, సొనాల గ్రామ వాసులు,చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు 2018 నుండి చేసిన పోరాటం చివరకు 2023 లో సొనాల మండల సాధనలో సఫలం చెందారు.
మండల సాధన కొరకు అనేక కార్యక్రమాలు వంట వార్పు,75 రోజుల రిలే నిరాహారదీక్షలు,ఇలా అనేక కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్ళారు.
నిర్మల్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో సోనాల గ్రామ ప్రజలు అక్కడ జరిగిన సభలో వీ వాంట్ సొనాల మండలము అని ప్లకార్డ్స్ పట్టుకోవడం తో నేను చూసాను అని అన్నాడు.
దాంతో సొనాల వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ
ఇటీవల కేసిఆర్ ఆసిఫాబాద్ లో పొడు పట్టల పంపిణీ కి రావడం తో మళ్ళీ సొనాల మండల నినాదం మళ్ళీ రూపం దాల్చింది.
అదిలాబాద్ జిల్లా నాయకులు కేసిఆర్ దృష్టి కి తీసుకెళ్లడంతో కేసిఆర్ తాను ఇచ్చిన హామీని రూపు దాల్చేల జీఓ
24 గంటల్లో జారీ చేయాలి అని సూచించి సొనాల మండల ఏర్పాటుకి మార్గం సుగమం చేయడం జరిగింది.
జీఓ రావడం తో సొనాల గ్రామ ప్రజలు మరియు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు సోనాలలో విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విజయోత్సవ సభలో పలువురు మాట్లాడుతూ సాధన కమిటీ అనునిత్యం సోనాల మండల ఏర్పాటులో ముందుండి సోనాల మండలం ఏర్పాటయ్యే వరకు వారు చేసిన కృషిని అభినందించడం జరిగింది.
అదేవిధంగా ఇటీవల ఆసిఫాబాద్ జరిగిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం గారి దృష్టికి అదిలాబాద్ శాసనసభ్యులు జోగు రామన్న గారు మాజీ ఎంపీ గెడం నగేష్ గారు సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సోనాల మండల ఏర్పాటులో వారి పాత్ర కూడా మరువలేనిది.
ఇలా అందరి సహకారంతో సోనాల మండల సాధన రూపం రూపుదాల్చడముతో సోనాల గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామవాసులు ఆనందం వ్యక్తం చేశారు.
సొనాల మండలం లో వజ్జర్ , చింతల్ బోరి, ఘన్ పూర్, సొనాల,కోట, సాకేర, పార్డి బి, పార్డి (కే) గ్రామాలను సొనాల మండలం లో కలపడం జరిగింది.
ఈ విజయోత్సవ సభలో ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు జోగు రామన్న గారు, మాజీ ఎంపీ గేడం నగేష్ గారు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గారు,
సోనాల గ్రామ ప్రథమ పౌరుడు చెట్లపల్లి సదానందం గారు,
దక్షణ మధ్య రైల్వే బోర్డ్ మెంబర్ జివి రమణగారు, నేరడిగొండ జెడ్పీటీసీ జాదవ్ అనిల్,అడే గజెందర్,తదితరులు
పాల్గొన్నారు..
ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థుల నిరసన