మైనర్ పై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై గుజరాత్ లోని తాపీ జిల్లా సోంగథ్ కు చెందిన పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేసిన అతని భార్యనూ అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మేలో ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
పాస్టర్ బలిరామ్ కొక్నీ ,అతని భార్య అనితను కోర్టులో హాజరుపరచగా …న్యాయస్థానం ఇద్దర్నీ పోలీసు కస్టడీకి పంపింది.
వ్యవసాయ కూలీగా పనిచేసే బాలిక తరచూ ప్రార్థనల కోసం చర్చికి వెళ్లేది. నిందితుడు ముందు ఆమెతో తరువాత కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నారు. ఓ రోజు పొలంలోని గుడిసెకు పిలిపించి ఆమెపై అత్యాచారం చేసినట్టు బాలిక చెబుతోంది. రెండోసారి డబ్బు ఆశ చూపి తనపై అత్యాచారం చేశాడని, మూడోసారి ప్రార్థన నెపంతో పిలిచి అత్యాచారం చేశారని… పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు సందర్భాల్లోనూ పాస్టర్ భార్య అక్కడే ఉందని బాధితురాలు వాపోయింది. అంతేకాదు పాస్టర్ అత్యాచారం చేస్తుండగా అతని భార్య అనిత ఫోన్ లో వీడియో రికార్డు చేసింది. ఆ వీడియోలు, ఫొటోలు చూపిస్తూ బెదిరిస్తున్నారని…ఎక్కడ బయటపెడతారోననే భయంతో తల్లిదండ్రులకు చెప్పి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది.