ఈ రోజు దేశంలో హిందూ అనండి హిందుత్వం ఆనండి దానిని ఎవ్వరు విస్మరించే పరిస్థితి లేదు , కాబట్టి మేము కూడా హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ,వాళ్లే ఒకప్పుడు హిందూ మతతత్వం, మతతత్వవాదులు అని విమర్శించి మాట్లాడారు, ఇప్పుడు మేము హిందువులమే అంటూ తిరకాసు పెడుతున్నారు. ఒకప్పుడు హిందువులు అంటే మతతత్వవాదులు అన్నా ఇప్పుడు మేము హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అన్న రెండిటికి కారణంISLAM . ఇస్లాం ఆక్రమణ వాళ్ళధోరణులు అందరికి తెలుసు కానీ వాళ్ళుఅంటే భయం అట్లా మాట్లాడిస్తున్నాదా, వాళ్లకు మేము రక్షణకవచం అని నమ్మించేందుకు మాట్లాడుతున్నారా, లేక అదొక ఫ్యాషనా అనేది ఈ దేశంలో పెద్ద ప్రశ్న.కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడు ఇస్లాం చుట్టూనే తిరుగుతూఉంటాయని స్వాతంత్ర పోరాటకాలం నుండి చరిత్ర చెబుతున్నది. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలోచిక్కుకున్నది అందుకే హిందూమతము హిందుత్వం వేరు ఎత్తుకొన్నది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు1992 నుండి ముస్లిం ఓటుబ్యాంకులనుండి దూరం నెట్టివేయబడ్డారు ,ముస్లిం లు ఒకరకంగా ప్రాతీయపార్టీల గొడుగుక్రిందికి వెళ్లిపోయారు కాంగ్రెస్ ఇప్పుడు . హిందువుల నుండి ముస్లింలనుండి దూరం ఐనారు మళ్ళీ తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు మేము హిందువులమే అని చెబుతూ హిందువులను ,మేము RSSచెప్పే హిందువులం కాదు అని చెబుతూ ముస్లింలను మచ్చిక చేసుకొనేందుకు గత కొద్ది సంవత్సరాలనుండి హిందువు –హిందుత్వం పై చర్చ లేవగొట్టారు అది కొనసాగుతున్నది. ఈ సందర్భం లో కాంగ్రెస్ నాయకుడు చిదంబరం వ్రాసిన వ్యాసం చూసాము ఇప్పుడు మరన్ని వివరాలు.. చూద్దాము .……
స్వాతంత్ర పోరాట సమయం నుండి హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
భారతదేశ స్వతంత్ర పోరాట కాలంలో 1920 తర్వాత సాంస్కృతిక జాతీయత పునాదులను బలహీనం చేసి అధికార మార్పిడి ఉద్యమాలకు కాంగ్రెస్ తెరలేపింది, గాంధీజీ ఒక ప్రక్క హిందుత్వ విషయంలో హిందూ ధర్మం విషయంలో చాలా స్పష్టంగా ఉంటూ, పత్రికల్లో కూడా హిందూ సమాజానికి సంబంధించిన అనేక విషయాలు సమస్యల పరిష్కారం విషయంలో స్పష్టంగా చెబుతూవుండేవారు మరో ప్రక్క స్వాతంత్ర పోరాటంలో అనుసరించే వ్యూహాలపై ఇస్లాం ప్రభావం కనపడుతుండేది ముస్లింలీగ్ తో సర్దుబాటు ధోరణి కనపడుతుండేది, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ముస్లింలలో వేర్పాటు ధోరణులను పెంచుతూ వాళ్లకు చాలా సహకరించింది దానికి మొదటి మెట్టు బెంగాల్ విభజన, అదే చివరకు దేశవిభజనకు కారణమైంది, ఆ సమయంలో ఇస్లాం బలంగా ఉన్న చోట హిందువులపై దాడులు చేయడం ప్రారంభమైంది, అసంఘటితంగా ఉన్న హిందువులు ఆత్మరక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు పారిపోవటం ప్రారంభమైంది, ఆ సమయం లో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రొఫెసర్ బాలి వ్రాసిన ” now it can be told” అనే పుస్తకంలో ”మహాత్మా గాంధీజీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, కృపాలాని మొదలైన కాంగ్రెస్ హేమాహేమీలు నిస్సహాయ స్థితిలో భగవంతుని పై పూర్తిగా భారం వేసి ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఆ నిస్సహాయులైన ప్రజలను కాపాడి సురక్షితంగా భారతదేశానికి పంపించింది ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమే”అని వ్రాశారు. ఆ తరువాత కాంగ్రెస్ కు ఒకరకంగా కలిసి వచ్చింది గాంధీజీ హత్య, ఎందుకంటే దేశ విభజన విషాదం పై కనీసం చర్చ కూడా జరగకుండా చేయగలిగింది,అంతేకాక సాంస్కృతిక జాతీయతను మతతత్వ వాదంగా బలంగా దేశంలో వినిపించగలిగింది, హిందుత్వం అంటే మతతత్వం అని బలంగా ప్రచారం చేసింది, దేశంలో ఇస్లాం మరింత విధ్వంసక శక్తి గా నిర్మాణం కావటానికి కూడా తోడ్పడింది. తన అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చింది, హిందూ జాతీయ శక్తులు నిలబడటానికి కొన్ని దశాబ్దాలు పట్టింది.
UPA ప్రభత్వం 20009-14 సమయం కాంగ్రెస్ పతనం ప్రారంభమా ?
2014 ముందు కాంగ్రెస్ అనేక వివిధ రాజకీయ పక్షాల నాయకులు మైనారిటీల ఓట్లనుసంపాదించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతుండేవారు,ఆ వ్యూహంలో కాంగ్రెస్ పరాకాష్ట సచార్ కమిటీ, ఆ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే హిందువులను ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా దిగజార్చే పెద్ద కుట్ర పన్నింది, అదిబెడిసికొట్టి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓటమిమాత్రమే కాదు అనేక సంవత్సరాల తర్వాత కేంద్రంలో స్పష్టమైన మెజారిటీకలిగిన ప్రభుత్వం ఏర్పాటు జరిగింది.దేశం లో కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోఒక ప్రక్క సమాజ్ వాది పార్టీ రెండో ప్రక్క కాంగ్రెస్ గాలిలో మేడలు కట్టే చాలా పోరాటం చేసి కుప్పకూలిపోయాయి ఆ పరాజయంతో కాంగ్రెస్ నిరాశా నిస్పృహలకు లోనయింది ఆ అనుభవంతో బహుశా చాలా చర్చలు జరిపిన తర్వాత దేశంలో మరో పెద్ద కుట్రకు తెరలేపింది అది ఒక ప్రక్క ముస్లిములను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే రెండవ హిందువులలో చీలిక తెచ్చేందుకు హిందూ – హిందుత్వం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది దానికి 2018లో కాంగ్రెస్ నాయకుడు మేధావి శశిధరూర్ ”why iam a hindu ” అనే గ్రంథం రచించాడు. దానిలో తను వ్రాసిన ముందు మాటలో రెండు విషయాలు ప్రస్తావన చేశాడు 1) ఈ గ్రంథం తనను తాను తెలుసుకోవడానికి, హిందువుగా తన జీవన గమనం ఎట్లా ఉంది, అట్లాగే నా తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఆధ్యాత్మిక వారసత్వం మొదలైన విషయాలపై పరిశీలనాత్మకత 2) 1980వ సంవత్సరం నుండి ఈ దేశంలో హిందూ జాగరణ కోసం జరిగిన ప్రయత్నాలు దాని తీరు తెన్నులు రాజకీయంగా హిందుత్వం బలపడటం హిందూమతతత్వం పెరగటం మొదలైన విషయాలు వ్రాసుకొంటూ వచ్చాడు
నెహ్రుఆలోచనలో ద్వందవైఖిరి ఉన్నదా ?
పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1935 న వ్రాసిన glimpses of world history పుస్తకంలో హిందూ జాతీయతను అంగీకరిస్తూ రాశాడు వారి మాటల్లోనే” హిందూ జాతీయ, నిజమైన జాతీయ కు మధ్య గీత గీయటం అంత తేలిక కాదు, అత్యధిక సంఖ్యాకులైన హిందువులకు ఏకైక నేలువుగా ఉన్న భారతదేశం దానికి కారణం ఆ రెండు సమ్మిళితమై పోయాయి” పేజి నెంబర్ 720. 1937 సంవత్సరంలో ఫారిన్ ఎఫైర్స్ పత్రికకు నెహ్రూ వ్రాసిన వ్యాసంలో భారతీయ నేపథ్యం ఐక్యత ప్రధానంగా సాంస్కృతిక మైనది, ఇరుకైన భావజాలం మాటల్లో చెప్పినట్లుగా అది మతపరమైనది కాదు అని నొక్కి వక్కాణించారు. మహాత్మా 1909వ సంవత్సరంలో హిందూ స్వరాజ్ పత్రికలో” దక్షిణాదిన సేతువు, తూర్పుతీరంలో జగన్నాథ మందిరం,ఉత్తరాన హరిద్వార్ పవిత్ర నదులు భారత్ లో ఐక్యతను తీసుకుని వచ్చాయని అని వ్రాసారు. 1940 వ సంవత్సరంలో కూడా అదే మాటపై నిలబడి ఉన్నాను అని చెప్పారు, దానిలో అక్షరం కూడా మార్చటానికి ఇష్టపడలేదు. 1995 సంవత్సరం హిందుత్వంపై సుప్రీం కోర్ట్ ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాని సారాంశం హిందుత్వం అంటే భారతీయుల జీవన విధానం, భారతీయ సంస్కృతి. దానిపై సమీక్ష చేయాలని 2019 లో సాల్మన్ ఖుర్షిద్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు , దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
హిందుత్వ– హిందూమతం పైDEC 1న’’ PAKISTAN TODAY’’ పత్రికలోAmjed Jaaved వ్రాసిన వివరాలు..……
హిదూత్వం అంటే యుద్ధం అని వ్రాసాడు అట్లాగే కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ రాసిన సన్రైజ్ ఓవర్ అయోధ్య పుస్తకంలోని విషయాలను హిందూత్వ వాదులు మాత్రమే కాకుండా గులాం నబీ ఆజాద్ వంటి మితవాద ముస్లిం నాయకులను కూడా అభ్యన్తరంవ్యక్తం చేసారు. హిందుత్వను ISIS మరియు బోకో హరామ్లతో ఉగ్రవాద సంస్థలతో పోల్చడం వివాదాస్పద మైంది. ఈ విషయాలను కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరియు రాహుల్ గాంధీ లు సమర్ధించారు. హిందువులు, ముస్లింలు మతం పేరుతో పోరాడేలా చేసే వారిని ఐఎస్ఐఎస్ లేదా మరేదైనా (టెర్రర్ గ్రూప్)తో పోల్చవచ్చు, ఎందుకంటే వారిద్దరూ మతం పేరుతో ప్రజలనుచంపేస్తున్నారు ’ అని మెహబూబా అన్నారు .హిందూ గ్రంధాలూ చెప్పేది ‘వసుధైవ కుటుంబకం‘అని చెప్పింది అంటే ప్రపంచమంతా ఒక కుటుంబము కానీ rss, bjp లు హిందూమతాన్ని, హిందుత్వాన్ని హైజాక్ చేసి దేశవ్యాప్తంగా ప్రజల మధ్య విభేదాలు నిర్మాణం చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు.సనాతన ధర్మం కలుపుకుపోవడాన్ని నేర్పుతుందని.దానికి బీజేపీ వ్యతిరేకమని ఆమె అన్నారు. అసలు సనాతన ధర్మం మతతత్వాన్ని బోధించదని మెహబూబా స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్–బీజేపీ సమ్మేళనం హిందూమతాన్ని, హిందుత్వాన్ని హైజాక్ చేసి దేశవ్యాప్తంగా ప్రజలను పరస్పరం దాడులు చేసుకొనేట్లు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు భారతదేశ రాజకీయాల్లో హిందుత్వ లేదా హిందూ జిహాద్ యొక్క అంతర్ప్రవాహాల గురించి ప్రపంచానికి అంతగాతెలియదు. హిందుత్వాన్ని రాజకీయాలకోసం ఉపయోగించుకొట్టున్నారు అని చెప్పారు.రాహుల్ గాంధీ ఒక ప్రశ్న సంధించాడు ”హిందూమతం ఒక ముస్లిం పైన ఒక సిఖ్ పైన దాడి చేయమని చెబుతుందా ?”తనేసమాధానం చెబుతూ హిందూ మతం చెప్పాదు కానీ హిందుత్వం చెబుతుంది” అని చెప్పాడు.ఇంకో తమాషా వాదనకూడా లేవకొట్టరు ”సింధు నుండి హిందూ అని వచ్చింది దానిని హిందుస్థాన్ అంటారు, స్థాన్ అనేపదం హిందుత్వ వాదులకు నచ్చదు ఎందుకంటే హిందుత్వ వాదులకు వైదిక మూలాలు కలిగిన భారతవర్షం నచ్చుతుంది.అట్లా హిందుత్వవాదులు హిందూ మతం మూలాలను తమకు అనుకూలంగా మలచుకొంటున్నారు అని వ్రాస్తూ, రైతు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకున్నది కానీ ముస్లిం వ్యతిరేక పౌరసత్వ సవరణ చట్టం మరియు జాతీయ పౌరసత్వ రిజిస్టర్నుఎందుకు వెనక్కి తీసుకోలేదు అని ప్రశ్నించాడు. అట్లాగే స్వాతంత్ర పోరాటం సమయం లో హిందూ విషయం లో స్పష్టంగా మాట్లాడిన వినాయక్ దామోదర్ సావర్కర్, డాక్టర్ హెడ్గేవార్ ఆలోచనలను విమర్శించాడు. భారతదేశంలోని మెజారిటీ మైనారిటీ భారతదేశాన్నిసావర్కర్ రచించిన హిందుత్వ పుస్తకంలో కోరుకుంటున్నారనే చేదు వాస్తవాన్ని వెలుగులోకి వచ్చింది . కానీ ,హిందూ మతం ఒక హిందువు గా ఇతర దేవుళ్లను, సాధువులను ఆరాధించడానికి అనుమతిస్తుంది. వేలన్కన్నిలోని పుణ్యక్షేత్రానికి పూజలు చేయడానికి, అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో ప్రార్థనలు చేయడానికి, , అజ్మీర్లోని దర్గా షరీఫ్కు నమస్కరించడానికి వేలాది మంది హిందువులు వెళ్తూఉంటారు ఇట్లాంటి శాంతియుత అస్తిత్వాన్నీ బలహీనపరచే స్వరాలు స్వరాలుపెరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్, భాజపా, వాళ్లు ఒకే భాష మాట్లాడుతున్నారు.ఉదాహరణకు RSS సర్ సంఘ ఛాల క్ మోహన్ జీ భాగవత్ కృష్ణానంద్ సాగర్ రచించిన ‘Vibhajan Kalin Bharat ke Sakshi’ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూవిభజన సమయంలో భారతదేశం పడిన బాధలను మరువలేమని ఆ విషయం మరచిపోకూడదని అట్లాగే విభజన రద్దయినప్పుడే వాటిని మరచిపోతామని అన్నారని వ్రాసాడు అట్లాగే ,భగవత్ ప్రసంగానికి, ముందు నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి చాలా సారూప్యత ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆగస్టు 15న ఎర్రకోట నుండి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తున్నప్పుడు, ‘ఆగస్టు 14ని ‘విభజన భయానక దినోత్సవం’గా పాటిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. విభజన గత శతాబ్దపు “అతిపెద్ద విషాదాలలో ఒకటి” అని ఆయన అభివర్ణించారు. ఈ ఇద్దరు ఒకే విషయాన్నీ ప్రస్తవించారు అని వ్రాసారు చైనా, పాకిస్థాన్లపై ఎప్పుడైనా యుద్ధం చేయటానికి భారత ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఫార్వర్డ్ ఏరియాల్లో పలు ఎయిర్ఫీల్స్ను మోదీ ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాల్లోని వ్యూహాత్మక రహదారుల నుంచి టేకాఫ్ చేసేందుకు IAF సాధన చేస్తోంది. అంతేకాకుండా, పాకిస్తాన్ను టెర్రర్ హబ్గా చూపిస్తూనే, భారతదేశం పొరుగున తిరుగుబాట్లను రెచ్చగొడుతోంది.దీనితో పాటు చరిత్ర లోని యుద్ధ నీతులు కు సంబంధించిన అనేకవిషయాలను విశేష అధ్యనం జరుగుతున్నది, మౌర్యులు మరియు గుప్తుల కాలంలో, సైనిక నాయకత్వం ,అతదుపరికాలం లో పడిపోయిన సైనిక నాయకత్వం కారణాలు అధ్యనం చేస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో మూడు యుద్ధ వ్యూహాలు ఉండేవి. 1)భీష్ముడి యుద్ధ నీతి ధర్మ యుద్ధం (నైతిక లేదా కేవలం యుద్ధం)కి చెందినది. మరో రెండు పాఠశాలలు,2) బృహస్పతి 3) కృష్ణుని యుద్ధ పాఠశాలలు కూట యుద్ధం (ఆల్–అవుట్ వార్) లేదా మాయ యుద్ధం (మాయలు లేదా వ్యూహాల ద్వారా జరిగే యుద్ధం)కి చెందినవి.ఉన్నాయి. ఇస్లాం జిహాద్ పై విపరీత ప్రచారం ఉన్నది మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని యుద్ధ నీతి పై చర్చ కూడా వ్రాసారు మొత్తానికి అనేక విషయాలపై చర్చమొదలైంది.