ఇంత ఘోరమా..? మరణించిన సైనికుల సంఖ్య గురించి ప్రశ్నిస్తే అరెస్టులా..?
ఏ దేశాన్నైనా నిరంతరం శత్రువుల నుంచి రక్షించేది సైనికులు మాత్రమే. అలాంటి సైనికులకు ఏ దేశమైనా ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది. అయితే కన్నింగ్ వేశాలు వేసే డ్రాగన్ కంట్రీ మాత్రం దేశాన్ని రక్షించే సైనికులకు మాత్రం సరైన గౌరవాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది. గతేడాది జూన్లో భారత సైన్యంతో చైనా సైనికులు ఘర్షణ పడ్డ సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అమరులైన 20 మంది సైనికులకు మోదీ సర్కార్ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను చేసింది. అంతేకాదు వారి కుటుంబాలను కూడా ఆదుకుంది. అయితే ఇదే సమయంలో అటు చైనా ఆర్మీకి కూడా ప్రాణనష్టం వాటిల్లింది. పలు అంతర్జాతీయ పత్రికలు తెల్పిన వివరాల ప్రకారం.. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నాయి.
అయితే చైనా మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేసింది. అంతేకాదు దాదాపు 8 నెలల తర్వాత గాల్వాన్ ఘర్షణలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. ఈ విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చైనా సైనికుల మరణాలను కూడా దాస్తుందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు చైనాకు చెందిన పలువురు జర్నలిస్టులు కూడా ఈ విషయంపై అనుమానాలు లేవనెత్తారు. దీంతో నియంత జిన్ పింగ్కు కోపం వచ్చినట్లుంది. వెంటనే సైనికుల మరణాల సంఖ్యపై ప్రశ్నించిన సదరు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులతో పాటు మరో వ్యక్తి సైనికుల మరణాల సంఖ్యపై అనుమానాలు లేవనెత్తారు. దీంతో సదరు వ్యక్తులను చైనా అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నాన్జింగ్కు చెందిన పరిశోధనాత్మక పాత్రికేయుడు క్యూ జిమింగ్(38) కూడా ఉన్నారు.
క్యూ జిమింగ్ తన బ్లాగ్లో గాల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికుల మరణాల సంఖ్యపై చైనా అధికారికంగా ప్రకటించిన విషయంపై అనుమానం వ్యక్తం చేశారు. చైనా మిలిటరీ ప్రకటించిన సంఖ్య కంటే ఎక్కువగా ఉండొచ్చని.. అలాగే ఈ విషయాన్ని వెల్లడించడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఈ కామెంట్స్పై స్పందించిన చైనా అధికారులు ఆయన్ఉ నాన్జింగ్లో అరెస్ట్ చేశారు. మరో జర్నలిస్టును బీజింగ్లో అరెస్ట్ చేశారు. ఇక పీఎల్ఊ సైనికులను అవమానించేలా కథనం పోస్ట్ చేశారంటూ మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.