తనను నిందించిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ పతనమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల మోదీని విషసర్పమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనీవ్యాఖ్యలు చేశారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా మళ్లీ తనను నిందించే పనిని కాంగ్రెస్ ప్రారంభించిందని..అయితే కాంగ్రెస్ పార్టీని తన పని తాను చేసుకోనివ్వండని…తాను మాత్రం కర్నాటక ప్రజల కోసం పనిచేస్తానని మోదీ అన్నారు. ఇప్పటికి 91సార్లు ఆ పార్టీ తనను అవమానించిందని గుర్తు చేశారు. అయితే బీజేపీపై ఎంత బురదజల్లితే అంత తేజస్సుతో కమలం వికసిస్తుందని ఆయన అన్నారు. ఆ పార్టీకి పదవులు తప్ప ప్రజలు పట్టరన్న మోదీ…లింగాయత్ లనూ వారు దూషించారని…అంబేద్కర్, వీరసావర్కార్ నూ వదల్లేదని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్నాటకలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళపలుప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటున్న మోదీ సోమవారం బెంగళూరులో రోడ్ షో నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం మైసూర్ నుంచి ఢిల్లీ పయనమవుతారు. మోదీ ఓ విషపాము వంటివాడని..ఆయ తీసుకొచ్చిన పథకాలు పైకి ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ రుచిచూస్తే చావు తప్పదని ఖర్గే అన్న సంగతి తెలిసిందే. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. అయితే నేరుగా స్పందించిన మోదీ కాంగ్రెస్ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు.
నన్ను ఎంత నిందిస్తే అంత పతనం అవుతారు, ఇప్పటికి కాంగ్రెస్ నన్ను 91 సార్లు అవమానించింది : ప్రధాని మోదీ
Share: