భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధించినట్టు ప్రకటించింది కేంద్రం. సబ్ సెక్షన్ 1 కింద అధికారాలను ఉపయోగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టంలోని UAPA సెక్షన్ 3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.
పీఎఫ్ఐతో పాటు రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్ లను బ్యాన్ చేస్తున్నట్టు జీవోలో పేర్కొంది హోంమంత్రిత్వశాఖ. ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ ,రిహాబ్ ఫౌండేషన్ కేరళ కేంద్రంగా పనిచేస్తున్నాయి.
సమాజంలోని యువత, విద్యార్థులు, మహిళలు, ఇమామ్లు, లాయర్లతో కలిసి పరిధిని విస్తరించుకుంటూ పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని ప్రభుత్వం తెలిపింది. సభ్యత్వసంఖ్యను ఏటికేడు పెంచుకుంటూ ఏటా కోట్లల్లో నిధులు సమకూర్చుకుంటోంది.
పూర్తిగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలతో సమాజంలోకి చొచ్చుకెళ్తున్నట్టు గుర్తించామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. PFI, దాని అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్లు సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ వ్యవస్థలుగా బలోపేతం అవుతూ బహిరంగంగానే పనిచేస్తున్నాయి. అయితే వాళ్లరహస్య ఎజెండా.. దేశంలో ప్రజాస్వామ్య భావనను అణగదొక్కడమే. రాజ్యాంగం పట్ల ఆయాసంస్థలకు ఏమాత్రం గౌరవం లేదనికేంద్రం తెలిపింది.
దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను దెబ్బతీయడం వారి లక్ష్యం. అందుకు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దేశంలో అశాంతి, కల్లోలం రేపడం, మత సామరస్యానికి భంగం కలిగించడమే వారి పని.
పీఎఫ్ఐ కి సిమితో ఉన్న సంబంధం స్పష్టమని ఈ సందర్భంగా కేంద్రం వ్యాఖ్యానించింది. మరో నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ తోనూ పీఎఫ్ఐకి లింక్స్ ఉన్నాయి. అనేక సందర్భాల్లో, PFI ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ వంటి గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో అనుసంధానమైంది.
ఇక అంతర్జాతీయ ఉగ్రసంస్థల్లో పీఎఫ్ఐ సభ్యులు చేరారని ప్రభుత్వం ఆరోపించింది. “PFI దాని అనుబంధ సంస్థలు, వ్యక్తులు ,ఫ్రంట్లు దేశంలో అభద్రతా భావాన్ని పెంపొందించడం ద్వారా ఒక కమ్యూనిటీని సమూలంగా పెంచడానికి రహస్యంగా పనిచేస్తున్నాయి. కొంతమంది PFI కార్యకర్తలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలలో చేరడం దాన్ని రుజువు చేస్తోంది. సిరియా, ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్. ఈ సిబ్బందిలో కొందరు ఘర్షణల్లో మరణించారని, మరి కొందరిని రాష్ట్ర పోలీసులు మరియు కేంద్ర ఏజెన్సీలు అరెస్టు చేశాయని కేంద్రం పేర్కొంది.
కాలేజీ ప్రొఫెసర్ టీజే జోసెఫ్ అంగాన్ని నరికివేయడం, పలువురిని హత్య చేయడం వంటి అనేక కేసుల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని, అందులో ఇటీవల బెల్లారె పట్టణంలో హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారును హత్యచేసింది వారేనని స్పష్టం చేసింది. ఈ కేసులో దక్షిణకన్నడ జిల్లాలో మొత్తం పది మంది నిందితులను అరెస్టు చేయగా, వారంతా పీఎఫ్ఐ సభ్యులు. పిఎఫ్ఐ మరియు పిఎఫ్ఐ రాజకీయ ఫ్రంట్ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) సభ్యులు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు స్థానిక పోలీసుల విచారణలో తేలింది.
నవంబర్ 15, 2021న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ ను హత్య చేసింది పీఎఫ్ఐ కార్యకర్తలే. వారి కార్యకలాపాలను సవాల్ చేస్తూ 2019లో దావా వేసిన హిందూసంఘాల నాయకుడు వి. రామలింగాన్ని హత్య చేశారు. నందు (కేరళ, 2021), అభిమన్యు (కేరళ, 2018), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కర్ణాటక, 2017), ఆర్ రుద్రేష్ (కర్ణాటక, 2016), ప్రవీణ్ పూజారి (కర్ణాటక, 2016) హత్య కేసులు ఉన్నాయి. కుమార్ (తమిళనాడు, 2016) హత్యలన్నీ పీఎఫ్ఐవే. ఇంకా వెలుగుచూడని హత్యలు ఎన్నో ఉండవచ్చనే చర్చనడుస్తోంది. 2021లో తమిళనాడులో , కేరళలో కొల్లాం జిల్లా పాడమ్ అటవీప్రాంతంలో జరిపిన దాడుల్లో పెద్దమొత్తంలో పేలుడుపదార్థాలు, జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయనే అంశాన్నినోటిఫికేషన్ లో తెలిపింది హోంమంత్రిత్వశాఖ.