ఆసియాలోనే అత్యంత పొడవైన దంతాలు కలిగిన 70 ఏళ్ల ఏనుగు భోగేశ్వర మరణించింది. దీంతో వన్యప్రాణ ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం బందీపూర్-నాగర్హోల్ రిజర్వ్ ఫారెస్ట్లోని కబిని రిజర్వాయర్ సమీపంలో చలనంలేకుండా పడిఉన్న ఏనుగును గుర్తించారు. దాన్ని మిస్టర్ కబిని అని పిలుస్తారు. ఆసియా ఖండంలోని అత్యంత పొడవైన దంతాలతో పర్యాటకులందరి దృష్టిని ఆకర్షించేది భోగేశ్వర.
ఏనుగుల ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్ కు భోగేశ్వరను ఐకాన్గా చేయాలని అటవీశాఖ యోచిస్తోంది. ఎగ్జిబిషన్ సెంటర్లో దాని దంతాలను భద్రపరచడానికి డిపార్ట్మెంట్ అనుకుంటోంది. దాని దంతాలలో ఒకటి 2.54 మీటర్లు (8 అడుగులు) పొడవు, మరొకటి 2.34 మీటర్లు (7.5 అడుగులు) ఉంది. రెండు దంతాలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. దట్టమైన అడవిలో వాటిని చూడటం ఒక గొప్ప విజువల్ ట్రీట్.
Kabini's iconic Bhogeshwara, which had the longest Tusks in the whole of Asia is no more. RIP. pic.twitter.com/Ltnk93j0We
— Susanta Nanda (@susantananda3) June 12, 2022
మైసూరు జిల్లా హెచ్.డి.కోటే తాలూకాలోని డీబీ కుప్పే ఫారెస్ట్ రేంజ్ సమీపంలో అటవీ అధికారులు భోగేశ్వర కళేబరాన్ని కనుగొన్నారు. విసెరా నమూనాలను మైసూరులోని రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఏనుగుది సహజ మరణమేనని నిపుణులు తెలిపారు. భోగేశ్వరకు పర్యావరణ ప్రేమికులతో పాటు నెటిజన్లు సోషల్మీడియాలో నివాణులు అర్పిస్తున్నారు.