దేశంలోనే పొడవైన టన్నెల్ రోడ్ హైదరాబాద్ లో రాబోతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్ టన్నెల్ను నిర్మించనున్నారు. ప్రతిపాదిత 4 లేన్ టన్నెల్… KBR పార్క్ జంక్షన్ మీదుగా NFCL జంక్షన్, పంజాగుట్ట వరకు సాగుతుంది. టన్నెల్ ను బోరింగ్ మెషీన్ను ఉపయోగించి తవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పగించింది. జిహెచ్ఎంసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సలహాదారులను నిమగ్నం చేయడం ద్వారా సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ప్రస్తుతం శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ దేశంలోనే అత్యంత పొడవైనదిగా ఉంది.
ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద బహుళస్థాయి ఫ్లైఓవర్లను నిర్మించడం ద్వారా కెబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లను ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది.. అయితే దాని కోసం 1,500 చెట్లను నరికివేయాల్సి ఉండేది. కెబిఆర్ పార్క్లోని వందలాది చెట్లను నరికివేయడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం టన్నెల్ రహదారిని ఎంపిక చేసింది.
కొన్నేళ్ల క్రితం, ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం పార్కు మొదటి సరిహద్దు గోడ లోపల చెట్లను తాకకూడదని GHMC కి చెప్పింది. ఈ నేపథ్యంలో చెట్లను నరికివేయకుండా భూగర్భ సొరంగం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)