దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కష్టాల్లో ఎదురీదుతోంది . చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పోగొట్టుకుంది. ప్రతిపక్షంలో ఉండడం వల్ల చాలామంది నాయకులు బ్యాగులు సర్దేసుకొని బిజెపికి ఇతర పార్టీలకు వరుస వెళ్లిపోయారు దీంతో పేరుకి పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడం కష్టంగా మారుతోంది . రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తిగా సరిపోవడం లేదు.
దీంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. దీంతో ప్రియాంక గాంధీకి బాధ్యతలు పెంచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది .
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటైన రాయి బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో సోనియాగాంధీ ఎంపీగా ఉన్నారు. ఇటీవల ఆమె రాజ్యసభ ని ఎంచుకోవడంతో రాయ బరేలికి ఖాళీ ఏర్పడింది సుదీర్ఘకారంగా నెహ్రూ కుటుంబానికి రాయ బరేలీ కంచుకోట. అందుచేత రాయబరేలి నియోజకవర్గంలో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచినట్లయితే గెలుపు సునాయాసం అవుతుందని హస్తం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక్కడికి దగ్గరలోని అమేధీ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి ఇదే కుటుంబం గెలుస్తూ వచ్చింది, కానీ మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోంది . అందుచేతనే సునాయాసంగా గెలిచే సీటుని ప్రియాంక గాంధీకి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది ప్రియాంక పార్లమెంట్లో అడుగు పెడితే బిజెపికి గట్టి పోటీ అవుతారని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన.