మే 7 న నమోదైన గరిష్ట స్థాయి నుండి కోవిడ్ కేసుల్లో క్షీణత దాదాపు 69% ఉందని,యాక్టివ్ కేసులు 50% తగ్గాయని , ఒక రోజులో 1.3 లక్షల యాక్టివ్ కేసుల్లోతగ్గుదల ఉంది. 30 రాష్ట్రాలు / యుటిలలో, కేసులు ఒక వారం నుండి స్థిరంగా తగ్గుతున్నాయని కేంద్ర నివేదిక ప్రకారం తెలుస్తున్నది ఇది సానుకూల ధోరణి. గత 24 గంటల్లో 1,27,000 కేసులు నమోదయ్యాయి . మే 28 నుండి క్రమంగా దేశం లో 2 లక్షల కన్నా తక్కువ కేసులు నమోదవుతున్నాయి .అంటే సంక్రమణలో క్షీణత ఉంది. కోవిద్-19 ప్రారంభమైన నాటి నుండి దేశ వ్యాప్తంగా 2, 81, 75,044 కేసులు నమోదు కాగా2,59, 47, 629 కోలుకొన్నారు 3,31, 909 .మంది చనిపోయినవారు , ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,95,520 ఉన్నాయి . దేశ వ్యాప్తంగా 30 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలలో వారం రోజులనుండి కేసులు స్థిరంగా తగ్గుతున్నాయి, ఇప్పుడు ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉన్నట్లయితే జూన్ మధ్య వరకు సంక్రమణ క్షిణత బహుశా అదుపులోకి రావచ్చు, జూన్ ఆఖరు వరకు పూర్తి అదుపులోకి వచ్చి దేశం లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చు అని అనిపిస్తున్నది.
కోవిద్-19 అదుపుకు కేంద్ర నిర్వహణ పై ప్రజలలో పెరుగు తున్న విశ్వాసం మే 23 నుండి 27 వరకు కోవిద్ మహమ్మారిని అదుపు చేయటంలో ప్రధాని మోడీ , ఒకవేళ రాహుల్ ప్రధానిగా ఉంటే ఎట్లా ఉంటుందని ABP C VOTER సర్వే నిర్వహించింది . దాని నివేదిక వివరాలు ….. ……
రాహుల్ నిర్వహణ పై పై దేశంలో 22%మంది ప్రజల విశ్వాసం కనబరిచారు , అందులో అర్బన్ ప్రజలూ20. 1% కాగా గ్రామీణ 22. 8%మంది అనుకూలం గా చెప్పారు. ప్రస్తుత ప్రధాని మోడీపైన 63. 1%మంది అందులో అర్బన్ ప్రజలలో 65. 8% గ్రామీణ ప్రాంతంలో 61. 1%మంది విశ్వసం వ్యకతంచేశారు . అట్లాగే 14. 9% మంది ఏమీ చెప్పలేము అని అన్నారు.
ప్రాంతాల ముఖ్యమంత్రుల నిర్వహణపై కూడా సర్వే చేసి ఉంటే కోవిద్-19 అదుపుకు దేశం లో ఎవరు ఏమి చేసారు అనేదానిలో స్పష్టత వచ్చేది.రాజకీయాలతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదని మీడియా నిపుణుల నుండి అభిప్రాయాలూ తీసుకోని విశ్లేషణ చేస్తే మరంత స్పష్టత వచ్చేది. మీడియా కు రాజకీయాల కోణంలోనే అభిప్రాయాలూ కావాలి, కేంద్రం పై దుమ్మెత్తి పోయాలి. ఏప్రిల్ మధ్య నుండి మే మూడవ వారం వరకు దేశ , విదేశీ మీడియా కవరేజ్ చూస్తే ఎవరి లక్ష్యం ఏమిటో మనకు స్పష్టమౌతుంది. వాళ్లందరికీ హిందుత్వం మోడీ, పై ఎంతమేరకు దుమ్మెత్తి పోయాలి అనేదే లక్ష్యం. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నికలలో పార్టీ ల విజయం కొరకు పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వారు వాస్తవ పరిస్థితులు అవగాహనా ఉండి కూడా మోడీ పై ప్రశ్నలు సందిస్తున్నారు అంటే మనదేశం లో చిల్లర రాజకీయాలు హోరు ఎంతవుందో అర్ధం చేసుకోవచ్చు. చివరగా అమెరికాకు చెందిన ప్రముఖ నిపుణుడి అభిప్రాయం ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో చేపట్టిన చర్యలు దేశమంతా చేపట్టి ఉంటే పరిస్థితి ఇంతగా అదుపు తప్పేది కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేసారు.రాజకీయలలో వైరుధ్యాలు ఉండవచ్చు కానీ విద్వేషాలు ఉండకూడదు. కానీ ఈ రోజు న కూడా రాజకీయాల నుండి మీడియా నుండి సద్విమర్శలు కంటే ఎక్కువ విద్వేష విమర్శలు వెల్లువెత్తటం కనబడుతుంది దేశంలో ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుందో ?