కశ్మీరీ హిందువుల ఊచకోత ఆధారంగా తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. 35ఏళ్లనాటి దమనకాండను తెరపై చూస్తూ ఉద్వేగం చెందుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో వాస్తవచరిత్రను చెప్తూ ఇలాంటి సినిమాలు రావల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు.
ఇదిలా ఉంటే దేవభూమిగా పిలిచే కేరళలో జరిగిన మహిళల అక్రమ రవాణా నేపథ్యంగా మరో సినిమారానుంది. ఆ భయానక కథనాన్ని “ది కేరళ స్టోరీ” చిత్రం ద్వారా దేశప్రజలముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత విపుల్ అమృత్లాల్ షా, రచయిత&దర్శకుడు సుదీప్తో సేన్.
చిత్ర కథనానికి సంబందించిన చిన్న వీడియోను రిలీజ్ చేశారు. కేరళ నుంచి ISIS, ప్రపంచంలోని ఇతర యుద్ధ ప్రాంతాలకు కొనసాగుతున్న కిడ్నాప్ లు.. అలాగే వేల మంది యువతుల అక్రమ రవాణా గురించి ఆ రాష్ట్ర అప్పటి సీఎం వీఎస్ అచ్యుతానందన్ అన్న మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. గణాంకాల ప్రకారం, 32 వేలకుపైగా మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు.
‘‘మానవ విషాదంగా సాగే ఈ కథ.. 3-4 ఏళ్లకుపైగా తన పరిశోధనతో పాటు సుదీప్తో వచ్చి నాతో చెప్పినప్పుడు తొలి సమావేశంలోనే కన్నీళ్లు వచ్చాయి. అదే రోజు నేను ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఈ కథనాన్ని రూపొందిస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నిజమైన, నిష్పాక్షికమైన కథనాన్ని రూపొందించాలని మేము ఆశిస్తున్నాము.” విఅని అన్నారు.
దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ.. “ఇటీవలి పరిశోధన ప్రకారం, 2009 నుండి హిందూ, క్రైస్తవ వర్గాలకు చెందిన కేరళ, మంగళూరు నుంచి దాదాపు 32,000 మంది బాలికలు ఇస్లాంలోకి మార్చబడ్డారు. వారిలో ఎక్కువ మంది సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ISIS సహా హక్కానీ ప్రభావవంతమైన ప్రాంతాలకు తరలించబడ్డారు. కేరళ, మంగళూరు నుంచి దాదాపు 32,000 మంది యువతులు అదృశ్యమైనప్పటికీ ఎన్ఐఏ కేవలం 99 కేసులను మాత్రమే విచారిస్తోంది. మా పరిశోధనల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు తప్పిపోయిన బాలికల తల్లుల కన్నీళ్లను చూశాము. వారిలో కొందరిని ఆఫ్ఘనిస్తాన్, సిరియా జైళ్లలో కనుగొన్నాము. చాలా మంది అమ్మాయిలు భయంకరమైన ఐసిస్ ఉగ్రవాదులను వివాహం చేసుకున్నారు. ఈ చిత్రం తమ కుమార్తెలను కోల్పోయిన తల్లులందరి వ్యధను జనాలకు వినిపించడానికి ప్రయత్నిస్తోంది” అని అన్నారు విపుల్.
https://twitter.com/sunshinepicture/status/1506143742243520515?s=20&t=Dl6gYcl2Sp5mPJZa0mLGBw
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)