యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిసింది ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం. మార్చి 20న లక్నోలో మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా సినిమా బృందం ఆయనతో సమావేశమైంది . అంతకుముందు రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తోనూ వారు భేటీ అయ్యారు. చిత్రానికి పన్నురద్దు చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. విడుదలైన రోజే కశ్మీర్ ఫైల్స్ టీంను ట్విట్టర్ వేదిగ్గా అభినందించారు యోగీ.
“ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం మతపరమైన దురభిమానాన్ని, ఉగ్రవాద అమానవీయ భయానకతను వెల్లడిస్తుంది. నిస్సందేహంగా ఈ సినిమా సమాజాన్ని, దేశాన్ని జాగృత పరిచేలా తోడ్పడుతోంది. ఇలాంటి ఆలోచింపజేసే చిత్రాన్ని నిర్మించినందుకు మొత్తం టీమ్కు అభినందనలు’ అని వారితో సమావేశం అనంతరం మరోసారి ట్వీట్ చేశారు యోగి.
https://twitter.com/myogiadityanath/status/1505508019374678024?s=20&t=Xp8yLPk20Mke8ZuNkNnYOw
యోగీ ట్వీట్ కు స్పందిస్తూ….”కశ్మీర్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ ఏకం చేయడంలో అద్భుతంగా పనిచేసింది. మీ అఖండ భారత్ విజన్ వైపు ఒక అడుగు వేసింది.. ఇది భారత నాగరికతకు స్వర్ణ యుగం” అంటూ రీట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి.
https://twitter.com/vivekagnihotri/status/1505511136656908295?s=20&t=i45FziwYKSprXY7zEbJu8g
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)