హిందీలో విడుదలై దేశవ్యాప్తంగా సునామీ సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్” మూవీ ఇక అన్ని ప్రాంతీయ భాషల్లో రానుంది. ఇందుకు సంబంధించి డబ్బింగ్ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. దక్షిణాది భాషలన్నింటిలోనూ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది చిత్రయూనిట్.
మార్చి 11న కేవలం 4 వందల థియేటర్లలో విడుదలైన కశ్మీర్ ఫైల్స్ వారం తిరిగేసరికి 4వేల థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. కశ్మీర్లోని 32 ఏళ్లనాడు జరిగిన హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ దేశ ప్రజలందర్నీ కదిలిస్తోంది. ఇప్పుడీ సినిమానే సంచలనం అని చెప్పవచ్చు. తాజాగా వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది కశ్మీర్ ఫైల్స్. 1990లో కాశ్మీర్ పండిట్లను ఎలా హింసించారు.. హత్యచేశారు. హిందువుల పట్ల స్థానిక ముస్లింలే ఎలాంటి మారణకాండకు తెగబడ్డారు,. సొంతగడ్డ నుంచే ప్రాణాలు అరచేత పట్టుకుని వాళ్లు ఎలా చెల్లాచెదురయ్యారు అనే అంశాలను చిత్రంలో చూపించారు వివేక్. హిందీలో విడుదలైన ఈ మూవీని దక్షిణాది ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు దర్శక నిర్మాతలు. డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి కూడా. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించారు. అయితే ఇప్పటికే 116 కోట్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు.
గతంలో ‘హేట్స్టోరీ’, ‘ద తాష్కెంట్ ఫైల్స్’ చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అందుకు ఆయన నాలుగేళ్లు రీసెర్చ్ చేశారు. కశ్మీర్లో పర్యటించడంతో పాటు కశ్మీర్ నుంచి బయటకివచ్చిన పండిట్లనూ ఆయన కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఇంకా వందలాది డాక్యుమెంటరీలు, లేఖలు, పలు పుస్తకాలను రిఫరెన్సు గా తీసుకుని దీన్ని తీశారు. మూవీ చూసిన ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కశ్మీర్ అసలైన చరిత్రను చూడాలని పిలుపునిచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)