కశ్మీరీ హిందువుల ఊచకోత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ ఎంతగా ప్రజాదరణపొందుతోందో అంతగా విమర్శలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. కశ్మీరీ పండిట్లు సహా హిందువులపై నాడు సాగిన అకృత్యకాండను తెరమీద చూస్తూ ప్రజలు కన్నీరుపెడుతున్నారు. అయితే నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకి వినూత్నంగా నివాళులు అర్పిస్తూ… సినిమాకు తనదైన శైలిలో మద్దతు తెలిపింది మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్టిస్ట్ మంజుసోని. చిత్రకారిణి అయిన మంజు తన రక్తంతో మూవీ పోస్టర్ పెయింటింగ్ గా వేసింది. చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన పల్లవీజోషి, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి సహా ఏడుగురి చిత్రాల్ని రక్తంతో గీసిందామె. తన ఒంటినుంచి తీసిన రక్తాన్నే అందుకు వాడారు. అందుకు సంబంధించి మధ్యప్రదేశ్ స్థానిక మీడియాసహా జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆమె ఫొటోల్ని, పత్రికలో వచ్చిన కథనాన్ని జతచేస్తూ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్మీడియాలో షేర్ చేశారు.
“OMG. Unbelievable. I don’t know what to say… how to thank Manju Soni ji. Shat shat pranam. Gratitude.
If anyone knows her, pl share her contacts with me in DM.
#RightToJustice”
అంటూ ఆయన పోస్ట్ చేయగా అనూహ్య స్పందన వస్తోంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు నాడు బలైన పండిట్లకు నివాళులు అర్పిస్తున్నారని కొందరంటే….ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చని..అయితే అందుకు తన ఒంట్లోని రక్తంతీసి రిస్కు చేయడం నచ్చలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
https://twitter.com/vivekagnihotri/status/1506885518373507074?s=20&t=_7PxZGVvZhFIUc7HzwBP4g