భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు. నూతన పతాకంలో ఎడమవైపు పై భాగంలో తిరంగాజెండా, కుడివైపు రెండు అష్ట భుజులు ఉన్నాయి. వాటి మధ్యలో ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ లంగరు క్రింద ‘సం నో వరుణః’ అనే నినాదం ఉంది. వేదం నుంచి తీసుకున్నఈ మంత్రానికి అర్థం…వరుణ దేవా! మా పట్ల దయ చూపించి, మాకు విజయాన్ని ప్రసాదించు’ అని . సెయింట్ జార్జ్ క్రాస్ కుముందు…తెలుపు రంగుపై రెడ్ క్రాస్, యునైటెడ్ కింగ్ డమ్ యూనియన్ జాక్ ఉండేది.
ఇక జాతీయ చిహ్నం చుట్టూ ఉన్న బంగారు వర్ణం అంచుకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజు రాజముద్ర. ఇది స్థిరత్వాన్ని వెల్లడిస్తుంది. ఎనిమిది దిక్కులను సూచించే విధంగా అష్టభుజిని ఏర్పాటు చేశారు. భారత నావికా దళం అన్ని దిక్కులను చేరగలదని ఇది తెలియజేస్తుంది.
ఇన్నేళ్లు భారతనావికాదళ పతాకంలో బానిసత్వ చిహ్నం ఉందని..ఇక చత్రపతి శివాజీ స్ఫూర్తితో కొత్తదాన్ని రూపొందించామని గర్వంగా ఉందని మోదీ అన్నారు.
హిందూహృదయ సామ్రాట్ గా పేరొందిన చత్రపతి శివాజీకి ఆ రోజుల్లోనే పెద్ద నావికాదళం ఉండేది. 60 యుద్ధ నౌకలు, సుమారు 5,000 మంది సైనికులు ఉండేవారు. విదేశీ దండయాత్రల నుంచి తీరప్రాంతాన్ని కాపాడిన తొలి నావికా దళం శివాజీదే.నావికాదళ గుర్తు ఆవిష్కరణకు ముందు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జలప్రవేశం చేయించి నావికాదళానికి దాన్ని అప్పగించారు. పూర్తిగా దేశీయంగా తయారైన తొలి విమాన వాహక నౌక ఇది.
https://twitter.com/narendramodi/status/1565619838865002500?s=20&t=HBr2T_ZWcASAhcGy4LjXrQ