వందేళ్ల క్రితం అపహరణకు గురైన మాతాఅన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికే చేరింది. కెనడాలో గుర్తించిన విగ్రహాన్ని ఇటీవలే భారత్ తీసుకువచ్చారు.ఢిల్లీనుంచి తీసుకొచ్చి యూపీ ప్రభుత్వానికి అందచేశారు.ఈనెల 15న సీఎం యోగి చేతులమీదుగా విశ్వనాథాలయంలో ఈవిగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.
1976 నుంచి మొత్తం 55 విగ్రహాలు భారతదేశానికి తిరిగి తీసుకురాగా ….అందులో 42 విగ్రహాలు 2014 తర్వాత తీసుకువచ్చినవే..