గడచిన కొద్ది సంవత్సరాలుగా ఘర్ వాపసీ అనే పదం పత్రికల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దానికి సంబంధించి అనేక కథనాలు వ్యాఖ్యానాలు ఫోటోలు వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య టైమ్స్ అఫ్ ఇండియా పత్రికలో వరుసగా మూడు రోజులు దీనిపై ప్రత్యేక వ్యాసాలు వచ్చాయి.ఒక వ్యక్తి పుట్టుకతో హిందువు అయ్యి సనాతన ధర్మం విశ్వసిస్తాడా ? అని న్యూస్ యాంకర్, సయీద్ అన్సారీ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానెల్ అయిన ఆజ్ తక్లో అడిగారు. అలాంటప్పుడు, ఒక హిందువు ముస్లిం వ్యక్తిని మతం మార్చగలడా? అలాగే, హిందూ విశ్వాసంలోకి మారడం వల్లవారి జాతి లేదా కులం మారుతుందా?ఈ ప్రశ్న అడిగిన న్యూస్ యాంకర్ చెప్పకనే మతం మార్చటం ముస్లిం ల హక్కు అన్నట్లు గా మాట్లాడాడు. ఎట్లా చర్చలు జరగటానికి నేపథ్యం ఉత్తరప్రదేశ్ లోని షియా సెంట్రల్ కమిటీ బోర్డ్ మాజీ సభ్యుడు, దానికి చైర్మన్ గా కూడా పని చేసినా వసీం రజ్వి 2021 డిసెంబర్ ఆరో తేదీన ఘజియాబాద్ లోని దాస్నా దేవాలయంలో అక్కడి ప్రధాన పూజారి యతి నరసింహా నందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో లో ఇస్లాం మతం నుండి హిందు ధర్మం లోకి మారారు, ఇప్పుడు వారి పేరు జితేందర్ నారాయణ సింగ్ త్యాగీ ఈ సందర్భంగా .వసీమ్ రజ్వి హిందు ధర్మం లోకి రావటానికి పూర్వ నేపథ్యం కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈయన అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు, అలాగే 2018 జనవరిలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కు ఒక ఉత్తరం రాశారు, దానిలో ” రాష్ట్రంలోని మదర్సాలను రద్దు చేయాలని సూచించారు , ఎందుకంటే ఆ మదర్సాలు ఉగ్రవాదుల ఆశ్రయ కేంద్రాలుగా మారుతున్నాయని” చెప్పారు. అట్లాగే 2021 మార్చి 12న సుప్రీంకోర్టులో వేసిన ఒక పిటిషన్ లో ఖురాన్ లో ప్రక్షిప్తం చేయబడిన ఆరు అంశాలను తొలగించాలని కోరారు.
రజ్వి హిందూ ధర్మం లోకి తిరిగి వచ్చిన తర్వాత ఆయనపై అనేక ప్రశ్నలు సంధించి బడ్డాయి, బెదిరింపులు కూడా వచ్చాయి , ఇస్లాం ఫండమెంటల్ లిస్ట్ లు కొందరు రజ్వీ తల నరికేస్తా మని కూడా ప్రకటించారు, దాని పై స్పందిస్తూ అదే జరిగితే నన్ను హిందూ ఆచారం ప్రకారమే అంత్యక్రియలు చేయాలని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ రకంగా అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే మరో విశేష కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో అవసరం. డిసెంబర్ 15వ తేదీ నాడు చిత్రకూట్ లో ” హిందూ ఏకతా కుంభ చాహే పంథ్ అనేక హో, సారే హింద్ ఏ క్ హో నినాదంతో” ఒక సమ్మేళనం పెద్దఎత్తున నిర్వహించబడింది ఆ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘసర్ సంఘ ఛాలక్ పాల్గొని మార్గదర్శనం చేశారు వారు అందరితో ఒక ప్రతిజ్ఞ చేయించారు”[ మేమందరం హిందూ మతం లోనే ఉంటాము, మతం మారిన వారినందరిని ఘర్ వాపసీ చేస్తామని” . హిందూ ధర్మం వదిలి వెళ్ళిన వారినందరిని సనాతన ధర్మం లోకి తీసుకొని రావాలి దానికి భయపడవలసిన అవసరం లేదు హిందూ సమాజం కులతత్వం సామాజిక దురాచారాల కు దూరంగా ఉంటూ హిందూ సమాజంలో ఐక్యతను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు, హిందువులు ఎప్పుడూ కూడా ఇతర దేశాలలో చోరబడలేదు, అట్లాగే ఇక్కడ ఉన్న ఇతర మతస్తులు అంటే ముఖ్యంగా ఇస్లాం క్రైస్తవం అందరూ కూడా ఎక్కడి నుండో ఈ దేశానికి రాలేదు, ఇక్కడి వారిని ప్రలోభపెట్టొ భయపెట్టొ మతం మార్చబడ్డారు, వారిని తిరిగి మన సనాతన ధర్మం లోకి తీసుకొని రావాలి. దానికి విశ్వహిందూ పరిషత్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నది.ఈ దిశలో పనిచేస్తున్నప్పడు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి , ఉదాహరణకు యితర మతాల నుండి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేవారందరిని ఏ కులం గా గుర్తిస్తాము, ఏ పంథా అనుసరించాలని సూచిస్తాము, దీనికి మోహన్జీభగవత్ జీ ఒక స్పష్టమైన వైఖరిని సభ ముందు ఉంచారు. మనమందరం కులాల విభజనను అధిగమించి మనం హిందువులం హిందూ సమాజం అని స్పష్టం చేశారు. కాలం చెల్లిన వాదనలను వదిలివేయాలి, మతం మారిన వారినందరిని తిరిగి హిందూ ధర్మంలో కి తీసుకొని రావాలి అదే ఘర్ వాపసీ అంటే. మన హిందూ సమాజంలో వందల సంవత్సరాల నిరంతర సంఘర్షణలు మతమార్పిడులు తరువాత మతం మారిన వారిని తిరిగి మన ధర్మం లోకి తీసుకోని వచ్చే పని ఉద్యమ రూపంలో తీసుకుని వచ్చే ప్రయత్నం 1875 లో మొదలైంది, స్వామి దయానంద సరస్వతి 18 75 లో ఆర్య సమాజ్ ప్రారంభం చేసి శుద్ధి పేరుతో మతం మారిన వాళ్లను తిరిగి హిందు ధర్మం లోకి తీసుకుని రావడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇది ఒక పెద్ద చర్చ అయింది, అనేక మంది వ్యతిరేకించారు, అయినా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్య సమాజ్ నిర్వహించింది.
భారతదేశ చరిత్రను అనేక మలుపులు తిప్పిన ఇస్లాం క్రైస్తవం
భారతదేశ చరిత్రలో ఇస్లాం, బ్రిటిష్ ఆక్రమణలు వేల సంవత్సరాలుగా భారతదేశ చరిత్ర లో లేని అనేక దుష్పరిణామాలకు తెరలేపింది, దానితో దేశంలో అనేక సామజిక ధార్మిక సమస్యలు తలెత్తయై . ఆ సమస్యల నుండి ఈ రోజుకి పూర్తిగా బయటపడలేకపోతున్నము . ఈ సమస్యకు ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న లక్షలాదిమంది హిందువులను బలవంతంగానో ప్రలోభాలకు గురి చేసో మతం మార్చబడటం, మతం మారటం అనేది ఆ మతాల బోధనలుప్రభావం కాదు ఉదాహరణకు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పాలకుల నుండి ప్రయోజనాలు పొందడానికి మతం మారిన వారు కూడా అనేక మంది కనబడుతూ ఉంటారు, ఆ స్వభావం ఈరోజు కూడా మనకి కనపడుతుంది, వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనా కాలంలో లోపాయికారిగా క్రైస్తవ మత మార్పిడులు జరిగితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం లో అనేకులు రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మతం మారటం అనేది మనం చూస్తున్నాం. మన దేశం మీద కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే దాడిచేయలేదు ,ఈ దేశం యొక్క వేల సంవత్సరాల చరిత్రను గమనించినట్లయితే ఇస్లాం కి పూర్వం కూడా అనేక దాడులు మన పైన జరిగాయి వాళ్ళు దోపిడీదారులు గా మన పైన దాడి చేసి సంపదలను దోచుకొని పోయారు, ఇక్కడే పరిపాలన కూడా చేశారు, వీళ్లంతా మధ్య ఆసియా నుండి వచ్చిన కుషాణులు శకులు లాంటి అనేక బర్బర జాతులు, వాళ్ళు ఎవరు ఈ దేశం లో మతం మార్పిడులు లాంటి సమస్యలు సృష్టించలేదు , హిందూ సమాజం శక్తివంతంగా వాళ్ల ఆక్రమణలను తిప్పికొట్టి సమాజాన్ని రక్షించింది, ఆ సమయంలో ఇక్కడ మిగిలిపోయిన ఆ జాతుల వాళ్ళు విశేషించి జైనము బౌద్ధము మతంలోకి మారిపోయారు, ఇక్కడి సామాజిక జీవన స్రవంతి లో కలిసిపోయి ఇక్కడివారు అయిపోయారు. ముస్లింలు అట్లా కాదు వాళ్ల ఆ క్రమణ లోనే రెండు లక్ష్యాలు ఉన్నాయి 1) పరిపాలనను చేజిక్కించుకోవడం దానికి భీకరమైన కుటిల యుద్ధాలు చేయడం 2) తమ పరిపాలనను సుస్థిరం చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మతమార్పిడులు చేయటం. దీని కారణంగా సమాజంలో సామాజిక, ధార్మిక సమస్యలు అనేకమైనవి తలెత్తాయి, దాని నుండి బయటపడే ప్రయత్నం ప్రారంభం కావడానికి వందల సంవత్సరాలు పట్టింది, ఈ నిష్ఠుర చారిత్రక సత్యం మనందరం గమనించవలసిన అవసరం ఉంది, ఆ సమయంలోదేశంలో ధార్మిక రంగంలో కొత్త పుంతలు తొక్కించి మతమార్పిడులు జరగకుండా ఆపేందుకు మాత్రమే ప్రయత్నం చేశారు కానీ మారిన లక్షలాది మందిని ఎట్లా తీసుకొని రావాలి అనే ప్రయత్నం జరగలేదు. నిష్ఠురం గా చెప్పాలంటే ఈ ప్రయత్నాన్ని దయానంద సరస్వతి స్వామీజీ ప్రారంభించారు, దయానంద సరస్వతి ఆర్య సమాజం ప్రారంభించిన తర్వాత ఈ పని ప్రారంభమైంది. దయానంద సరస్వతి రెండు ప్రయత్నాలు చేశారు 1) వేదాల అంతరార్థాన్ని మన సమాజం యొక్క పటిష్టతకు వ్యాఖ్యానించి బోధించారు, హిందూ సమాజం సంఘటనకు బాటలు వేశారు, వికృత సంస్కృతుల నుండి బయటపడటానికి ప్రజల స్థితిగతులను మార్చటానికి కృషిచేసి ఒక నూతన పంథాను వికసింప చేశారు. వేద విధి విధానాలు అట్టడుగున ఉండే సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 1) హవనం అంటే యజ్ఞం 2) యజ్ఞోపవీతధారణ 3) గాయత్రీ మంత్రోపాసన . వీటి ద్వారా సమాజంలో ఒక శక్తి నిర్మాణం చేయటానికి ప్రయత్నం చేశారు, అంతేకాక ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారిని తిరిగి తీసుకుని రావటానికి 1877లో శుద్ధి కార్యక్రమం రూపంలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ వివరాలు కొన్ని 1880 సంవత్సరంలో ఆర్య సమాజ్ పత్రికల ద్వారా మనం తెలుసుకోవచ్చును. మతం మార్చబడ్డా హిందువులను తిరిగి వేద ధర్మం లోకి తీసుకుని వచ్చి హిందూ సమాజంలో భాగంగా మార్చేశారు.
పంజాబ్ సెన్సస్ రిపోర్ట్ 1911, వాల్యూమ్ XIV, పై పండిట్ హరికిషన్ కౌల్ రచించిన దానిప్రకారం , 1884లో అమృత్సర్లో సామూహిక శుద్ధికార్యక్రమమును రికార్డ్ చేసినట్లు నివేదించబడింది. అదేవిధంగా, యునైటెడ్ ప్రావిన్సెస్ సెన్సస్రిపోర్ట్ 1911 కూడా 1907 మరియు 1910 మధ్య జరిగిన శుద్ధికార్యక్రమము చాలా వరకు నమోదు చేసినట్లు చెప్పబడింది. 1,052 మంది ముసల్మాన్ రాజ్పుత్లు శుద్ధి కార్యక్రమం లో తిరిగి హిందూ ధర్మం లోకి తీసుకోని వచ్చారు. దీనికి ఆ కాలం లో ఉన్న హిందూ మహాసభ వంటి ఇతర హిందూ సంస్థలు ఆమోదం తెలిపాయి, పండిట్ మదన్ మోహన్ మాలవీయ , లాలాలజపతిరాయ్ లాంటి ప్రముఖులు దానిని స్వాగతించారు. 1920వ సంవత్సరంలో వీర సావర్కర్ ఆ రోజుల్లో హిందూ ఐకాన్ గ ప్రసిద్ధి. వారు1931లో హిందూ సమాజానికి ఏడు సంకెళ్ళు అనే పేరుతో ఒక పుస్తకం రచించారు అందులో
1)మతం మారిన వారిని మళ్లీ తిరిగి మన ధర్మం లోకి తీసుకుని రావటాన్ని వ్యతిరేకించటం అంటే శుద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేకించటం
2) సహపంక్తి భోజనాలను వ్యతిరేకించడం
3) కులాంతర వివాహాలను రాద్ధాంతం చేయడం
4 ) అంటరానితనం
5) కొన్ని వృత్తుల పై నిషేధం విధించటం
6) సముద్ర యానాన్ని నిషేధించడం
7)వివిధ దురాచారాలు –నిషేధాలు
ఈ రోజుల్లో ఇందులో కొన్ని విషయాలు వింటుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మతం మారిన వాళ్లను తిరిగి శుద్ధ కార్యక్రమం ద్వారా తీసుకుని రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు చాలా తీవ్ర సంఘర్షణకు కూడా జరిగింది, మతం మారిన వారిని తీసుకుని రావడం విషయంలో మన ప్రాచీన గ్రంధాలలో ఎక్కడ లేదు అని వాదించేవారు అనేక మంది ఉండేవారు. అది అప్పటి సమస్యకాదు, ఇప్పుడు వేలమంది మనకళ్లముందే మతం మారుతూఉంటే స్పందించవలసిన అవసరం లేదా అని ఆలోచించకపోవడం. ఆ విషయం లో స్వామి దయానంద సరస్వతి వరకు ఎటువంటి కార్యాచరణను ప్రకటించకపోవటం. దయానంద సరస్వతిస్వామి ప్రారంభించిన ఉద్యమం ఊపు అందుకుంది, 1923 సంవత్సరంలో భారతీయ హిందూ శుద్ధి సభ ఒకటి ఏర్పాటు అయింది దానికి అధ్యక్షుడిగా స్వామి శ్రద్ధానంద ను ఎన్నుకొన్నారు. ఆ సభ పశ్చిమ యునైటెడ్ లో విశేషంగా పని చేసింది. అక్కడ ఉన్న మల్ ఖాన్ రాజపుత్రులను తిరిగి హిందూ ధర్మం లోకి తీసుకుని రావడం లక్ష్యంగా పెట్టుకున్నారు, వారు ప్రధానంగా మధుర,ఆగ్రా, ఏటా , మెయిన్ పూర్ లలో మల్ ఖాన్ రాజపుత్రులు ఇస్లాంలోకి మారినప్పటికీ హిందూ ఆచారాలను పాటిస్తున్నారు , ఈ విషయాన్ని గమనించి అటువంటివారినిఅరవై వేల మందికి పైగా శుద్ధి కార్యక్రమం ద్వారా హిందూ ధర్మం లోకి తీసుకుని వచ్చారు. ఈ విధంగా చారిత్రిక తప్పిదాలను సరిచేసుకొని హిందుసమాజాన్ని శక్తి వంతం చేసుకోవటం నేటితక్షణ అవసరం ఆ దిశలో వేగంగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి.
Courtesy :- NewsBharatiyam