ఇవాళ పార్లమెంట్ మొదలుకాగానే.. ఆదానీ గ్రూపు వ్యవహారంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అటు రాజ్యసభలోనూ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంకాగానే…ఆ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ సహా పలు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అందుకు సభాపతి అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగించవద్దని స్పీకర్ నచ్చజెప్పినా సభ్యులు వినకుండా పట్టుబట్టారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. 2 గంటలకు తిరిగి ప్రారంభమైన తరువాత కూడా అదే పరిస్థితి.దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.