ఈసారి బడ్జెట్లో రక్షణమంత్రిత్వశాఖకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అత్యధికంగా రూ.5.94 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం డిఫెన్స్ కు కేటాయించింది.సరిహద్దుల్లో పొరుగుదేశాల నుంచి సవాళ్లు పెరిగిపోతుండడం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా రక్షణరంగ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రాధాన్యత ఇచ్చింది. నూతన ఆయుధాల సేకరణ, దేశీయంగా తయారీకి ఊతమివ్వడమే లక్ష్యంగా నిధులు కేటాయించింది. రక్షణరంగం తర్వాత రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖకు రూ.2.70 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించింది. ఇక రైల్వే మంత్రిత్వశాఖకు రూ.2.41 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీల శాఖకు రూ.2.06 లక్షల కోట్లు, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు రూ.1.96 లక్షల కోట్లు, ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖకు రూ.1.78 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.60 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు రూ.1.25 లక్షల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కు రూ.1.23 లక్షల కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్ 2023-24లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.