వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య టఫ్ వార్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీఎంసీ నేతలను ఎదుర్కొనేందుకు బీజేపీ బలమైన అభ్యర్ధులను బరిలోకి దింపుతోంది. బెహలా వెస్ట్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా సీనియర్ నేత, మాజీమంత్రి పార్ధ ఛటర్జీ బరిలోకి దిగుతున్నారు. అయితే బీజేపీ సదరు మంత్రిపై బెంగాల్ హీరోయిన్ స్రవంతి ఛటర్జీని పోటికి నిలబెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్రవంతి ఛటర్జీ.. బీజేపీ తనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రచారం చేపడుతున్నానని.. ప్రజలంతా తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.