ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు అయినట్లే. అక్కడ రాజధాని ని పెద్ద ఎత్తున తీసుకుని వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటిదాకా జరిగిన తప్పుల్ని జగన్ ఖాతాలో చూపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను వెల్లడిస్తూ ఒక శ్వేత పత్రం రూపొందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను స్పష్టంగా వివరించారు
అమరావతి విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వెల్లడించారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
అమరావతి రాజధానికి కేబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, అలాగే దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా యమునా నీటిని, మట్టిని తీసుకువచ్చారన్నారు. అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని… రాజధానికి సహకరిస్తామని చెప్పారన్నారు. అమరావతికి పార్లమెంట్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారన్నారు.
ఈ సందర్భంగా
అమరావతి చరిత్ర ను ఆయన గుర్తు చేశారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీనిని రాజధానిగా నిర్ణయించినట్లు చెప్పారు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తాడన్నారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ జ్ఞాపకాలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు ఉండగా… తాను వచ్చాక సైబరాబాద్ను నిర్మించానన్నారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్కు ఒక ఎకోసిస్టంను తయారు చేశామన్నారు. పద్ధతి ప్రకారం… ప్రణాళిక ప్రకారం ఈ నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేయడం కోసం తాను ఆ సందర్భంలో 14 రోజుల పాటు అమెరికాలో ఉన్నానని… కంపెనీలను తీసుకువచ్చానన్నారు. ఆ తర్వాత పరిశ్రమలను కూడా తెచ్చానన్నారు.
ఇప్పుడు సైబరాబాద్ ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో తాను రాక్ గార్డెన్ను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ సైబరాబాద్ మహా నగరం ఎలా ఉండేదో చెప్పడానికి రాక్ గార్డెన్ ఏర్పాటు చేశానన్నారు. ఏ ప్రాజెక్టు అయినా విన్-విన్ పద్ధతిలోనే ముందుకు సాగామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. శంషాబాద్ తదితర ప్రాంతాల్లో అలాగే ముందుకు సాగామని చెప్పారు. అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్ పూలింగ్ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అమరావతిదే అన్నారు. వరల్డ్ బ్యాంక్ దీనిని ఓ కేస్ స్టడీగా చూపించిందన్నారు. ల్యాండ్ పూలింగ్లో భాగంగా రాజధానికి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించామన్నారు.
దీనిని బట్టి చూస్తుంటే అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది అని అర్థమవుతోంది . త్వరలోనే కోర్టు క్లియరెన్స్ తీసుకుని పనుల్ని వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.