ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో ఐకేపీ సెంటర్ ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనే నాథుడే లేడని.. ఐకేపీ సెంటర్ లో నెలరోజులు అయినా కాంటాలు పెట్టే దిక్కు లేదనీ అన్నారు. ప్రగతి భవన్ లో కూర్చుని కెసిఆర్ చెప్పే మాట ఇక్కడ చెల్లుబాటు కావడం లేదన్నారు. విధిలేక తెగనమ్ముకుంటున్న రైతులు, ప్రజాప్రతినిధులు వెళ్తే కాళ్లమీద పడుతున్నారని.. అయినా ప్రభుత్వానికి కనికరమే లేదని అన్నారు. ముందు ధాన్యం కొనాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం తడిచాయి అనే పేరుతో క్వింటాల్ కి 10 కేజీలు కట్ చేస్తున్న తీరు సిగ్గుమాలినతనమని ఈటల మండిపడ్డారు. .రాష్ట్రంలో ఉన్న నాయకులు, మంత్రులకు ఆత్మీయ సమ్మేళనాల మీద, దావతుల మీద ఉన్న శ్రద్ద రైతులమీద లేదన్నారు.
ప్రభుత్వానికి రైతు గోస పట్టదా – కాళ్లమీద పడుతున్నా కనికరం లేదా : ఈటల
Share: