హిందూ యువకుడి మెడ చుట్టూ బెల్టు కట్టి, కుక్కలా మొరగమంటూ ముగ్గురు ముస్లిం యువకులు వేధించిన దారుణం మధ్య ప్రదేశ్ లో వెలుగుచూసింది. ఆ వీడియో సోషల్మీడియాలోనూ వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారు.సమీర్, సాజిద్, ఫైజన్ లాల్ అనే యువకులు విజయ్ రామచందానీ అనే వ్యక్తి మెడకు బెల్టుకట్టి రోడ్డుమీద కూర్చోబెట్టారు. కుక్కలా మొరగమంటూ బెదిరించినట్టు 48 సెకన్ల ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
https://twitter.com/erbmjha/status/1670674797007900672?s=20
తనను కొట్టారని, మతం మారమని బలవంత పెట్టారని, బీఫ్ తినమని ఒత్తిడి చేశారని…కత్తితో బెదిరించి చంపబోయారని విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్కూటర్ తాళాలు, రెండు ఫోన్లు, డబ్బు లాక్కోవడమే కాక… తన తల్లిని, చెల్లిని దుర్భాషాలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని..వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలని,
జాతీయ భద్రతా చట్టం ఎన్ఐఏ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వీడియో బయటకు వచ్చాక కొన్ని గంటలకే పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. వారి ఇళ్లను కూల్చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.
https://twitter.com/NewsArenaIndia/status/1670758886805057536?s=20