హైద్రాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహరానికి కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా నిర్ధారించారు పోలీసులు. అంతేకాదు సాదుద్దీన్ మాలిక్తో కలిసి పబ్లో అరాచకాలకు పాల్పడినట్లు తేలింది. నిందితుల వేధింపులు భరించలేక పబ్ నుంచి బయటకు బాలికలు వచ్చారని పోలీసులు తెలిపారు.
అయితే ఆ ఇద్దరిలో ఒకరు.. బయటకు వచ్చి నేరుగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయారు. మిగిలిన మైనర్పైనే దుండగులు దాష్టికానికి పాల్పడింది సాదుద్దీన్, అతని గ్యాంగ్. ఇంటి వద్ద దించుతామని గ్యాంగ్ నమ్మించింది. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్ఖాన్కు చెందిన బెంజ్ కారులో.. అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు గ్యాంగ్ వెళ్లింది. బెంజ్ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. అది భరించలేక.. కాన్సూ బేకరి వద్ద నుంచి వెళ్లిపోతానని వాళ్లతో చెప్పింది. దీంతో మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ముందుకు వెళ్లారు. ఫోన్ కాల్ రావడంతో కారులో ఉన్న ఎమ్మెల్యే కుమారుడు మధ్యలోనే దిగిపోయాడు. ఆపై బెంజ్ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ డ్రామాలాడింది ఆ గ్యాంగ్.
వెనుకాలే మరో ఇన్నోవాలో వక్ఫ్బోర్డు చైర్మన్ కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత బాలికను గ్యాంగ్ ఇన్నోవాలోకి తరలించింది. బంజారాహిల్స్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం తర్వాత నిందితులు బేకరికి వచ్చారు. ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్స్టాలో పోస్టు చేశారు.
అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు నమోదు కాగానే.. నిందితులు హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఆపై ఇన్నోవా కారును వక్ఫ్బోర్డు చైర్మన్ ఫాంహౌస్లో దాచారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒక మేజర్తో ముగ్గుర్ని అరెస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.