గోమాత మీద అభిమానాన్ని చాటుకొన్న సంఘటన ఇది. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి మండల కేంద్రంలో హనుమాన్ మందిర్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న గోమాత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచింది. దీంతో గ్రామ పెద్దలు సనాతన ధర్మం, సంప్రదాయాలతో అంతిమ యాత్ర చేపట్టారు. మహిళలు మంగళ హారతి ఇచ్చి గోమాత ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహిళలు, మండల కేంద్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ విధంగా గోమాత మీద తమ అభిమానాన్ని చాటుకొన్నారు.