అసోం, వెస్ట్ బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెస్ట్ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు మొదటి ఫేస్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాటు చేశామని ఈసీ పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఓటర్లు స్వేచ్చగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు ఈసీ తెలిపింది. అయితే ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ క్యూలైన్లు కట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది.
అయితే బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసి వెళ్లేలా.. అన్ని ఏర్పాట్లు చేశామని.. భారీ భద్రతను కల్పించామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. తొలి విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో.. పోలీసు భద్రతను భారీగా ఏర్పాటు చేశారు. మొత్తం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ప్రముఖులంతా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అసోంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో పోటిదారుల్లో ప్రముఖులే ఎక్కువ ఉండటంతో ఆసక్తి నెలకొంది.
#WestBengalElections2021: Voting underway at booth number 67A in Patashpur assembly constituency, East Midnapore pic.twitter.com/pENvB8fq43
— ANI (@ANI) March 27, 2021
First phase voting of Assembly Elections in West Bengal and Assam begin pic.twitter.com/MrHglWekgn
— ANI (@ANI) March 27, 2021