గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు గానూ తొలివిడలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఎన్నిక జరుగుతోంది. మిగతా స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 788 మంది అభ్యర్థులు బరిలో ఉండగా…వారిలో కేవలం 70మంది మాత్రమే మహిళలు. సౌరాష్ట్ర – కచ్, గుజరాత్ దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్ లో ఎన్నికల్ని బీజేపీ సహా అన్ని పార్టీలూ సవాలుగా తీసుకున్నాయి.