కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశ వ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్కు వేసిన తర్వాత.. 60 ఏళ్ల పైబడ్డ వారికి రెండో దశలో వ్యాక్సిన్ డ్రైవ్ జరగగా.. ఇప్పుడు మూడో దశలో 45 ఏళ్లు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సోమవారం నాడు లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరోనా వ్యాక్సిన్ను రూపొందించిన శాస్త్రవేత్తలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. అందరూ నిబంధనలను పాటించాలని కోరారు. ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
Video byte of UP CM Yogi Adityanath on Covid vaccination
(Editors note: Earlier issued Live Sound byte is retracted) pic.twitter.com/td9qQHSnrX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 5, 2021
I thank PM & Union Health Ministry for making vaccine available free of cost. I also thank scientists of the country. The vaccine is completely safe. We all should take it when our turn comes: UP Chief Minister Yogi Adityanath pic.twitter.com/jwhSfwsuIq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 5, 2021